అక్షయ పాత్ర ఫౌండేషన్భారతదేశంలో పనిచేస్తున్న ఒక లాభాపేక్షలేని సంస్థ. ఇది భారతదేశంలోని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం వండి, దానిని నేరుగా ప్రభుత్వం ఆధ్వర్యంలోని పాఠశాలలకు అందజేస్తుంది. ఇది 2000లో ప్రారంభించబడింది. పిల్లలు ఆకలితో చదువుకు దూరమవకుండా నిరోధించడమే ఈ ఫౌండేషన్ లక్ష్యం.[1]
అక్షయ ఫౌండేషన్ పది రాష్ట్రాల్లోని 10,000 ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకు, 14 రాష్ట్రాల్లోని పది లక్షల మంది విద్యార్థులకు వ్యక్తిగతంగా మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. ఇది, భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశంలో 22 కేంద్రీకృత ఆధునిక పరిశుభ్రమైన వంటశాలలను కలిగి ఉంది.[3][4][5][6][7]