గణపతి నరేష్ పట్వారీ | |
---|---|
జననం | బోధన్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, | 13 డిసెంబరు 1972
నివాసం | ముంబై, మహారాష్ట్ర |
రంగములు |
|
వృత్తిసంస్థలు | |
చదువుకున్న సంస్థలు |
|
ప్రసిద్ధి | మాలిక్యులర్ క్లస్టర్లపై అధ్యయనాలు |
ముఖ్యమైన పురస్కారాలు |
గణపతి నరేష్ పట్వారీ, తెలంగాణకు చెందిన రసాయన శాస్త్రవేత్త, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయిలో కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్. వైబ్రేషనల్ స్పెక్ట్రోస్కోపీపై అధ్యయనం చేశాడు.[1] రసాయనశాస్త్రంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం అందుకున్నాడు.
నరేష్ పట్వారీ 1972 డిసెంబరు 13న[2] తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలో జన్మించాడు.[3] తన స్వగ్రామంలోనే ప్రారంభ పాఠశాల విద్యను చదివి,[4] 1992 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఎస్సీ పూర్తిచేశాడు. ఆ తరువాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చేరి 1994లో[5] మాస్టర్స్ డిగ్రీ (ఎంఎస్సీ) పూర్తి చేశాడు.
2000లో పిహెచ్,డి.లో చేరి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో డాక్టరల్ పరిశోధన కొనసాగించాడు. 2000-02 సమయంలో జపాన్ సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ సైన్స్ ద్వారా అందించబడిన ఫెలోషిప్పై తోహోకు విశ్వవిద్యాలయంలో, 2003లో అర్బానా-ఛాంపెయిన్లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో పోస్ట్-డాక్టోరల్ వర్క్ చేసాడు. నరేష్ పట్వారీ పరిశోధనలు అనేక వ్యాసాల ద్వారా డాక్యుమెంట్ చేయబడ్డాయి, రీసెర్చ్గేట్ అనే ఆన్లైన్ ఆర్టికల్ రిపోజిటరీ ఆఫ్ సైంటిఫిక్ ఆర్టికల్స్ వాటిలో జాబితాలు చేయబడ్డాయి.[6] అనేక సెమినార్లలో ప్రసంగాలు, పత్ర సమర్పణలు చేశాడు.[7][8]
2003లో భారతదేశానికి తిరిగివచ్చి, 2003 ఏప్రిల్ నెలలో బొంబాయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాడు. 2007లో అసోసియేట్ ప్రొఫెసర్ గా మారి, 2012లో ఆచార్య హోదా పొందాడు.[5]
సైంటిఫిక్ రీసెర్చ్ కోసం భారత ప్రభుత్వ అత్యున్నత ఏజెన్సీ నుండి 2017 కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అవార్డు,[9] రసాయన శాస్త్రాలకు చేసిన కృషికి గానూ అత్యున్నత భారతీయ సైన్స్ అవార్డులలో ఒకటైన సైన్స్ అండ్ టెక్నాలజీకి శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం అందుకున్నాడు.[9][10]