జైనేంద్ర జైన్ | |
---|---|
జననం | జైనేంద్ర కుమార్ జైన్ 2009, అక్టోబరు 4 |
మరణం | 2007 డిసెంబరు 23 | (వయసు 68)
వృత్తి | దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత |
జైనేంద్ర జైన్ (2009, అక్టోబరు 4 - 2007, డిసెంబరు 23) గుజరాత్ కి చెందిన బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత.
జైనేంద్ర జైన్ 2009, అక్టోబరు 4న గుజరాత్ లోని సూరత్ లో జన్మించాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్టుగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి, అక్కడ ఒక దశాబ్దానికి పైగా పనిచేశాడు. 1973లో విడుదలైన బాబీ సినిమాతో రచయితగా హిందీ సినిమారంగంలో అడుగుపెట్టాడు. ఇది 1970లలో రెండవ అత్యధిక వసూళ్ళు సాధించిన హిట్ సినిమాగా నిలిచింది. ఇది డింపుల్ కపాడియాకు మొదటి సినిమాగ కాగా, రిషి కపూర్ ప్రధాన పాత్రలో నటించిన మొదటి సినిమా.
ఆ తరువాత రాజ్ కపూర్,[1] బాపు, కె. విశ్వనాథ్, సుభాష్ ఘై, సతీష్ కౌశిక్, రాజ్ కన్వర్ వంటి దర్శకుల సినిమాలకు రచనలు చేసాడు.[2][3]
జుదాయి (1997), కాళీచరణ్ (1976), దాగ్: ది ఫైర్ (1999), తేరే నామ్ (2003) వంటి అనేక ఇతర విజయవంతమైన సినిమాలను రాశాడు.[4][5] ఇతడు రాసిన అందాజ్ సినిమా ద్వారా లారా దత్తా, ప్రియాంక చోప్రాలు సినిమారంగంలోకి వచ్చారు. సుభాష్ ఘాయ్, కె. విశ్వనాథ్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమాలు, రాకేష్ రోషన్ నిర్మాతగా మొదటి సినిమా, జయప్రద, ఖుష్బూ, పద్మిని కొల్హాపురే, అనిల్ కపూర్లకు ప్రధాన పాత్రల మొదటి సినిమాలు ఇతడు రాసినవే కావడం గమనార్హం.
ఇతడు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా 2007, డిసెంబరు 23న ముంబైలో మరణించాడు. ఇతనికి భార్య, కుమార్తెలు ఉన్నారు.