నితిన్ బోస్ | |
---|---|
![]() 2013లో భారతదేశం స్టాంపుపై నితిన్ బోస్ | |
జననం | |
మరణం | 14 ఏప్రిల్ 1986 కలకత్తా, పశ్చిమ బెంగాల్, భారతదేశం | (aged 88)
వృత్తి | చిత్ర దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, స్క్రీన్ రైటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1930–1972 |
నితిన్ బోస్ (1897 ఏప్రిల్ 26 - 1986 ఏప్రిల్ 14) భారత చలనచిత్ర దర్శకుడు, సినిమాటోగ్రాఫర్. స్క్రీన్ రైటర్ కూడా. కలకత్తాలో జన్మించిన ఆయన న్యూ థియేటర్స్తో కలిసి 1930 - 40 దశకాలలో బెంగాలీ, హిందీ ద్విభాషా చిత్రాలను రూపొందించాడు. ఆ తరువాత బొంబాయికి వెళ్లి బాంబే టాకీస్, ఫిల్మిస్తాన్ బ్యానర్లలో దర్శకత్వం వహించాడు.
ప్లేబ్యాక్ గానం భారతీయ చలనచిత్రాలలో 1935లో నితిన్ బోస్ దర్శకత్వం వహించిన చిత్రాలతో ప్రారంభమైంది. మొదటి సారి బెంగాలీ చిత్రం భాగ్య చక్రలో, అదే సంవత్సరం దాని హిందీ రీమేక్ ధూప్ ఛాన్లో
విజయవంతమైంది. ఆ తరువాత గంగా జమునతో ప్లేబ్యాక్ సింగింగ్ అత్యంత ప్రసిద్ధి చెందింది.
నితిన్ బోస్ బెంగాలీ పారిశ్రామిక వేత్త హేమేంద్ర మోహన్ బోస్, మృణాళిని కుమారుడు. మృణాళిని సోదరుడు రచయిత ఉపేంద్రకిషోర్ రే చౌదరి, తండ్రి కవి సుకుమార్ రే కాగా తాత సినీ దర్శకుడు సత్యజిత్ రే. నితిన్ బోస్కు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉండేది. స్వతహాగా గొప్ప ఫోటోగ్రాఫర్ అయిన అతని తండ్రి తన కొడుకును అదే రంగంలో ప్రోత్సహించాడు.[1]