ములగాడ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°41′57″N 83°13′26″E / 17.699095°N 83.224024°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Founded by | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
Government | |
• Type | మేయర్ |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
జనాభా | |
• Total | 1,75,575 |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530011 |
శాసనసభ నియోజకవర్గం | పశ్చిమ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం |
లోక్సభ నియోజకవర్గం | విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం |
ములగాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా, మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాంతం.[1] ఈ ములగాడ ప్రాంతం విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ పరిపాలనలో ఉంది. ఇక్కడ రెవెన్యూ డివిజన్ ప్రధాన కార్యాలయం కూడా ఉంది. విశాఖపట్నం నగరానికి దక్షిణ అంచున ఈ ములగాడ ప్రాంతం ఉంది.[2][3]
ములగాడ మండలంలోని వార్డులు
ఇక్కడికి 2 కి.మీ.ల దూరంలో మల్కాపురం, 3 కి.మీ.ల దూరంలో గాజువాక, 6 కి.మీ.ల దూరంలో పెదగంట్యాడ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ నౌకానిర్మాణ కేంద్రం, విశాఖపట్నం నావల్ డాక్యార్డ్, కోరమండలం ఇంటర్నేషనల్ వంటి చాలా భారీ పరిశ్రమలు ఇక్కడ నిర్మించబడ్డాయి. ఈ ప్రాంతం విశాఖ పట్టణ ఆర్థిక వృద్ధిలో ఒక భాగంగా ఉంది.
విశాఖపట్నం విమానాశ్రయం నుండి 11 కిలోమీటర్లు, విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఈ ములగాడ ప్రాంతం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ములగాడ మీదుగా వెంకోజిపాలెం, ఓహ్పో, అరిలోవ, హెచ్బి కాలనీ, మిధిలాపురి కాలనీమొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో గోపాలపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]
ఈ ములగాడ ప్రాంతంలో కోరమాండల్ ఇంటర్నేషనల్, హిందుస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, తూర్పు నావికాదళం వంటి భారీ సంస్థలు ఉన్నాయి.
1960ల ప్రారంభంలో అమెరికాలోని ఐఎంసి, చేవ్రన్ కంపెనీలచే స్థాపించబడిన భారతీయ సంస్థ ఈ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. మొదట్లో కోరమాండల్ ఎరువులు అని పిలువబడే ఈ సంస్థ ఎరువులు, పురుగుమందులు, ప్రత్యేక పోషకాల వ్యాపారంలో ఉండేది. ఈ సంస్థ గ్రోమోర్ సెంటర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో గ్రామీణ రిటైల్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించింది.
భారతదేశం తూర్పు తీరంలోని విశాఖపట్నంలో ఉన్న షిప్యార్డే ఈ హిందూస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్). సింధియా షిప్యార్డ్గా స్థాపించబడిన దీనిని ది సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ లిమిటెడ్లో భాగంగా పారిశ్రామికవేత్త వాల్చంద్ హిరాచంద్ నిర్మించాడు. వాల్చంద్ 1940 నవంబరులో భూమిని స్వాధీనం చేసుకున్నాడు.
భారత నావికాదళానికి చెందిన మూడు ప్రధాన నిర్మాణాలలో ఒకటైన తూర్పు నావికాదళం[3] ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది. ఇది భారతదేశంలోనే మొదటి, అతిపెద్ద నావికాదళ కమాండ్.