రాష్ట్రీయ సిఖ్ సంఘత్ అనేది భారతదేశానికి చెందిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కు సిక్కు అనుబంధ సంస్థ. రాష్ట్రీయ సిఖ్ సంఘత్ ఒక హిందూ జాతీయవాద సంస్థ.[1]
ఇది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చేత ప్రేరణ పొంది ప్రారంభించబడింది. ప్రధానంగా రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో చురుకుగా పనిచేస్తుంది.
దేశ సమగ్ర నిర్మాణంలో హిందువులను, సిక్కులను ఏకం చేయడమే దీని ముఖ్య లక్ష్యం.[1]
2014 లో, రాష్ట్రీయ సిఖ్ సంఘత్ అధ్యక్షుడిగా గుర్చరన్ సింగ్ గిల్ ఎంపిక అయ్యాడు.
ఇది సిక్కుల గురువులను, వారి విశ్వాసాన్ని ప్రత్యేకంగా గౌరవిస్తుంది అని సంఘత్ జాతీయ అధ్యక్షుడు జిఎస్ గిల్ చెప్పారు. న్యూ ఢల్లీలో గురు గోవింద్ సింగ్ (పదవ సిక్కు సాధువు) 350 వ జయంతిని పురస్కరించుకుని సంఘత్ కార్యక్రమాన్ని నిర్వహించింది.[2]