స్థాపించిన తేదీ | 30 అక్టోబరు 1932ముంబై, భారతదేశం |
---|---|
స్థాపకులు | మహాత్మా గాంధీ |
ప్రధాన కార్యాలయం |
|
అంతర్జాలం | https://harijansevaksangh.org |
హరిజన్ సేవక్ సంఘ్ భారతదేశానికి చెందిన లాబాపేక్ష లేని సేవా సంస్థ. ఇది భారతదేశంలో అంటరానితనం నిర్మూలించడానికి, హరిజనులు, దళిత ప్రజల కోసం పనిచేయుట కొరకు, భారతదేశంలోని అణగారిన తరగతి ప్రజల అభ్యున్నతి కోసం 1932 లో మహాత్మా గాంధీ దీనిని స్థాపించాడు. [1] దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని కింగ్స్ వే క్యాంప్ లో ఉంది. భారతదేశ వ్యాప్తంగా దీని శాఖలు 26 రాష్ట్రాలలో ఉన్నాయి. [2]
రెండవ రౌండు టేబులు సమావేశం లండన్లో సెప్టెంబరు 7, 1931న ప్రారంభమయ్యింది. రెండవ సమావేశము యొక్క ప్రధాన కార్యమంతా సమాఖ్య స్వరూపం, అల్పసంఖ్యాక వర్గాల పై నియమించిన రెండు కమిటీలు నిర్వర్తించాయి. మహాత్మా గాంధీ ఈ రెండు కమిటీలలో సభ్యుడు.
రెండవ రౌండ్ టేబుల్ సమావేశం తరువాత, బిఆర్ అంబేద్కర్ అభ్యర్థన మేరకు అణగారిన వర్గాలకు కమ్యూనల్ అవార్డు ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. హిందూ సమాజాన్ని విభజిస్తుందని భావించిన ప్రభుత్వ నిర్ణయాన్ని గాంధీ వ్యతిరేకించాడు. తరువాత యెర్వాడ జైలులో నిరవధిక ఉపవాసానికి వెళ్ళాడు. 1932 సెప్టెంబరు 24 న అంబేద్కర్తో పూనా ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఆయన ఉపవాసం ముగించాడు. సమాజంలో అంటరానితనాన్ని తొలగించడానికి సెప్టెంబరు 30 న గాంధీ ఆల్ ఇండియా యాంటీ అన్టచ్బిలిటీ లీగ్ను స్థాపించాడు. తరువాత దీనిని హరిజన్ సేవక్ సంఘ్ ("సర్వెంట్స్ ఆఫ్ అన్టచ్బిలిటీ సొసైటీ") గా మార్చారు. [3] ఆ సమయంలో పారిశ్రామికవేత్త ఘన శ్యాం దాస్ బిర్లా దాని వ్యవస్థాపక అధ్యక్షుడిగా అమృత్లాల్ తక్కర్ కార్యదర్శిగా ఉన్నారు. [4]
హరిజన సేవా సంఘ్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని కింగ్స్ వే క్యాంప్ లో ఉంది. ఇది క్యాంపస్ లోని వాల్మీకి భవన్ లో గాంధీజీ ఒకగదిలో ఆశ్రమంగా నిర్వహించేవాడు. కస్తూర్బా గాంధీ వారి పిల్లలతో పాటు ఏప్రిల్ 1946 నుండి జూన్ 1947 వరకు బిర్లా హౌస్కు వెళ్లడానికి ముందు సమీపంలోని కస్తూర్బా కుటిర్లో బస చేశారు. నేడు ఈ 20 ఎకరాల ప్రాంగణంలో గాంధీ ఆశ్రమం, హరిజన్ బస్తీ, లాలా హన్స్ రాజ్ గుప్తా పారిశ్రామిక శిక్షణా సంస్థ ఉన్నాయి. అక్కడ బాలురు, బాలికలకు రెసిడెన్షియల్ పాఠశాల కూడా ఉంది. [5] [6] దీని ప్రధాన కార్యాలయం గాంధీ ఆశ్రమం, కింగ్స్వే క్యాంప్ను ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గాంధీ వారసత్వ ప్రదేశంగా జాబితాలో చేర్చింది. భారతదేశం. గాంధేయ వారసత్వ ప్రదేశాలు | సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
దేవాలయాలు, పాఠశాలలు, రోడ్లు, నీటి వనరులు వంటి ప్రభుత్వ స్థలాలను పొందటానికి అణగారిన వర్గాలకు ఈ సంఘం సహాయపడింది, ఈ సంస్థ కులంతర భోజనశాల, కులాంతర వివాహాలను నిర్వహిస్తుంది. [7] ఇది దేశవ్యాప్తంగా అనేక పాఠశాలలు, హాస్టళ్లను నిర్మించి నిర్వహిస్తుంది. [8]
1939 లో, ఎ. వైద్యనాథ అయ్యర్ నేతృత్వంలోని తమిళనాడుకు చెందిన హరిజన్ సేవక్ సంఘ్ మదురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయంలోకి ప్రవేశించింది. ఈ దేవాలయంలోకి పి.కక్కన్తో సహా అణగారిన తరగతి సభ్యులు ఉన్నత కులాలుగా భావిస్తున్న హిందువుల వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రవేశించారు. అయ్యర్ నేతృత్వంలోని సంఘ్ తమిళనాడులోని ఇతర ప్రాంతాలలో, ట్రావెన్స్కోర్ తో సహా అనేక ఆలయ ప్రవేశ ఉద్యమాలను నిర్వహించింది. [9] [10] వారి ఉద్యమాల ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు 100 కు పైగా దేవాలయాలు తెరవబడ్డాయి. [11]