![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
అచ్యుత్ | |
---|---|
అచ్యుత్ | |
![]() అచ్యుత్ ఛాయాచిత్రపటం. | |
జననం | అచ్యుత్ 1964 జూలై 1 |
మరణం | 2002 డిసెంబరు 26 |
మరణ కారణం | గుండెపోటు |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | సినీ , టెలివిజన్ నటుడు |
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ |
జీవిత భాగస్వామి | రమాదేవి |
పిల్లలు | సాయి సుజాత , సాయి శివాని |
తల్లిదండ్రులు | కూనపరెడ్డి సుజాత , కూనపరెడ్డి రామారావ్ |
పురస్కారాలు | నంది అవార్డు , జయసేన్ అవార్డు |
'అచ్యుత్' ఒక తెలుగు టెలివిజన్, సినీ నటుడు. ఇతను తెలుగు దూరదర్శిని, సినిమాలలో అనతికాలంలో మంచి పేరు సంపాదించిన నటుడు.[1] చిన్న ప్రాయంలోనే గుండెపోటుతో హఠాత్తుగా మృతిచెందాడు.
కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల నుంచి నటనపై ఆసక్తి చూపాడు. 1983లో రెండేళ్ళు హైదరాబాదు లోని మధు ఫిలిం శిక్షణా సంస్థలో నటనలో శిక్షణ పొందాడు. 1986లో ఇంధ్ర ధనస్సు అనే దూరదర్శన్ సీరియల్ లో తొలిసారి నటించాడు. తరువాత వెన్నెల వేట, 1988లో హిమబిందు, ప్రేమ అంటే ఇదే సీరియల్స్ లోనూ, 1989లో మిస్టర్ బ్రహ్మానందం, ఇదెక్కడైనా ఉందా అనే సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమా రంగంలో ప్రవేశించి 1991లో జంధ్యాల దర్శకత్వంలోని ప్రేమ ఎంత మధురం, 1992లో బి.సి.శేఖర్ దర్శకత్వంలోని పట్టుదల సినిమాలలో నటించాడు. ఇతని కృషికి గుర్తింపుగా 1990లో జాతీయ స్థాయిలో జయసేన్ అవార్డు అందుకున్నాడు. హిమబిందు, మిస్టర్ బ్రహ్మానందంలో అతని నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. 1990 సంవత్సరంలో ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డునుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకున్నాడు.
2002 సంవత్సరంలో గుండె పోటుతో హఠాన్మరణం చెందాడు.