అదితి రాథోర్ | |
---|---|
జననం | [1] | 1993 అక్టోబరు 30
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2014–ప్రస్తుతం |
అదితి రాథోర్ భారతదేశానికి చెందిన టెలివిజన్ నటి. ఆమె స్టార్ ప్లస్ లో ప్రసారమైన నామ్కారన్లో అయేషా పాత్రలో నటనకుగాను మంచి గుర్తింపునందుకుంది. [3] [4]
రాథోడ్ 30 అక్టోబర్ 1993న జైపూర్లో జన్మించింది. ఆమె రాజస్థాన్లోని బికనీర్లో పెరిగి బికనీర్లోని దయానంద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను, ఆ తర్వాత నటనపై ఆసక్తితో ముంబైకి వెళ్లింది. ఆమెకు సోదరి అపర్జితా రాథోడ్, సోదరుడు ఆర్యమాన్ రాథోడ్ ఉన్నారు.
అదితి రాథోర్ జీ టీవీలో ప్రసారమైన కుంకుమ్ భాగ్య సీరియల్ ద్వారా నటిగా అరంగ్రేటం చేసి ఆ తర్వాత సోనీ టీవీ ఛానెల్లో ప్రసారమైన ''ఏక్ దూజే కి వాస్తే'' సీరియల్ ద్వారా మంచి గుర్తింపునందుకుంది. [5]
సంవత్సరం | షో | పాత్ర | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|
2014–2016 | కుంకుం భాగ్య | రచనా ఆకాష్ మెహ్రా | సహాయనటి పాత్రలో | [6] |
2016 | ఏక్ దుజే కే వాస్తే | ప్రీతి తివారీ | [7] | |
2017–2018 | నామకరణ్ | అవనీ అయేషా / అవనీ నీల్ ఖన్నా | ప్రధాన పాత్ర | [8] |
2021 | ఆప్కీ నజ్రోన్ నే సంఝా | డా. ఛార్మి | ప్రతినాయకి పాత్రలో | [9] |