ఆచంట | |
---|---|
ఆలయ గోపురం, అచంట | |
![]() | |
అక్షాంశ రేఖాంశాలు: 16°35′54″N 81°48′42″E / 16.59833°N 81.81167°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | ఆచంట |
విస్తీర్ణం | 21.01 కి.మీ2 (8.11 చ. మై) |
జనాభా (2011)[1] | 19,507 |
• జనసాంద్రత | 930/కి.మీ2 (2,400/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 9,786 |
• స్త్రీలు | 9,721 |
• లింగ నిష్పత్తి | 993 |
• నివాసాలు | 5,604 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్కోడ్ | 534123 |
2011 జనగణన కోడ్ | 588688 |
ఆచంట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలం లోని గ్రామం.[2] ఇది సమీప పట్టణమైన పాలకొల్లు నుండి 16 కి. మీ. దూరంలో ఉంది.పాలకొల్లుకి 16 కి.మీ రోడ్ మార్గంఉంది.తణుకుకి 30 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడి శ్రీ రామేశ్వరస్వామి దేవాలయము, శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయములు బహుళ ప్రసిద్ధి చెందినవి.ఊరిలో ఆర్యవైశ్యులు, కమ్మవారు, బ్రాహ్మణులు అధికంగా ఉన్నారు. చుట్టు ప్రక్కల గల దాదాపు పదిహేను గ్రామాలకు ఆచంట పెద్ద వ్యాపార కేంద్రం.
రామేశ్వర స్వామి వారి ఆవిర్భావమునకు సంభదించి ఒక ఆసక్తియైన కథనం ఉంది. దీని ప్రకారం కాశీలో విశ్వనాధుని సన్నిధినందు శివరాత్రి జాగరణ పూజాదులు నెరపవలెనని కాశీకిచేరుకొనేందుకు బయలుదేరిన ఒక బ్రాహ్మణుడు ఈ మార్గమున ప్రయాణిస్తూ ఆతిధ్యము కొరకై ఒక వేశ్య ఇంట బస చేసెను. తదుపరి ఆ వేశ్యకును అతడికిని సాన్నిహిత్యము కలిగి అన్నిటినీ మరచి ఆ బ్రాహ్మణుడా ఇంటినందే సర్వ సుఖలాలసుడై ఉండి పోయెను. ఒక రాత్రి అతని చెవిన వేదమంత్రోచ్చాటన, శివపంచాక్షరీ జపములు విని పించెను. దానితో పాటు ఈ రాత్రియే శివరాత్రి అనియు అది శివరాత్రి జాగరణ కొరకు బ్రాహ్మణులు భక్తులు చేయు కోలాహలముగా గ్రహించెను తను ఈసమయమున కాశీలోనుండవలసినదనీ అతడికి జ్ఞాపకమొచ్చెను.తక్షణము ఏమిచేయుటకు పాలుపోక తాను చేసిన తప్పిదమునకు మిక్కిలి చింతంచుచూ పరమేశ్వరా నన్ను క్షమింపుమని వేడుతూ పిచ్చివానివలె గృహమంతయూ తిరుగుచుండెను.అట్లు తిరుగుచూ ఉన్న అతని దృష్టి తల్పముపై వివస్త్రయై శయనించియున్నఆవేశ్య యొక్క వక్షాగ్రభాగమునుపై బడెను.మరుక్షణం అతనికి అందే ఈశ్వరుడు కానవస్తూ ఆగృహమే కైలాశంగా వెలుగులు చిమ్ముతూ అగుపించుచుండెను. అంతట ఆబ్రాహ్మణుడు భక్తి పారవశ్వముతో గృహాలంకరణ కొరకు తేబడిన పుష్పాలతో ఆమె వక్షబాగమును పూజింప మొదలిడెను.అట్లు ఆరాత్రి అంతయూ అంతర్ముఖుడై సర్వేశ్వరుని యందే మనస్సును లగ్నము చేసి చేసి సొమ్మసిల్లి పడిపోయెను.అపుడు వెలుగులు విరజిమ్ముచూ శ్రీ మహాదేవదేవుడు ప్రత్యక్షమాయెను.భక్తా నీ నిచ్చలమైన భక్తికి మెచ్చాను ఏమికావలెనో కోరుకొనమనెను. అహా నా భాగ్యము నిను చూచు అదృష్టము దక్కినది అని పలువిదాలుగా స్తుతిస్తూ అయ్యా సుఖధుఖ్ఖాలు బోగాలు భాగ్యాలు అన్నీ నీ మాయయేకథ స్వామీ నాకు మోక్షము ప్రాసాధించు నే పూజించిన రూపున నీవిక్కడ వెలసిన అదియే మహా భాగ్యము అనెను.అట్లే నీకును నీవలన ఈమెకునూ ఇరువురకూ మోక్షము ప్రసాదించుచున్నాను.అని అంతర్ధానమయ్యెను.ఆవేశ్య పరుండిన అదే ప్రదేశమున స్తనాగ్ర రూపమున శ్రీ రామేశ్వర స్వామి వెలసియుండెను.ఈ దేవాలయము నాలుగు వైపుల సింహద్వారములతోనూ ప్రాకారము లోపలిబాగమున అనేక చిన్న దేవాలయములతో గుడినానుకొని పుష్కరిణితో దేవాలయపు ప్రధాన సింహద్వారము ప్రక్కగా సాంస్కృతిక కార్యక్రమములకు విశాల కళా ప్రాంగణముతోనూ విలసిల్లుతూ ఉంటుంది.ప్రతి సంవత్సరమూ శివరాత్రి ఉత్సవాలు ఐదు రోజులు పాటు జరుగును. ప్రసిద్ధ సినీ కళాకారులతో కార్యక్రమములు జరుపబడును ఇక్కడి తీర్దము బస్టాండ్ రోడ్డు నుండి దాదాపు అరకిలోమీటరు వరకూ విస్తరించి ఉండును.ఛుట్టు ప్రక్కల ఎన్నోగ్రామాలకు ఇదే ప్రధాన కూడలి అవడంవలన ఈ ఉత్సవములలో ఇసుకవేస్తే రాలదనేటట్లుగా జనంవస్తూంటారు.[3]
ఒడయనంబి అనే శివభక్తుడు చన్నుని పూజించడంతో ఏర్పడిన శివలింగం ఇక్కడ ఉందని కావ్యప్రశస్తి, పౌరాణిక ప్రసిద్ధి పొందిన విషయం. ఆ చంట (ఆ చన్నున) శివుడు వెలసిన కారణంగా ఆయనను ఆచంటేశ్వరుడని, గ్రామాన్ని ఆచంట అనే పేర పిలుస్తూంటారు.[4] శృంగవరపుకోట దానశాసనగ్రహీత మాతృశర్మ ఆచంట గ్రామస్తుడని సా.శ.5వ శతాబ్ది నాటి శాసనం తెలుపుతోంది. దీన్ని అనుసరించి అప్పటికే ఆచంట అన్న పేరు వుండేదని కచ్చితంగా తెలుస్తోంది. సా.శ.1256లో ఆచంట సూర్పరాజుకు అప్పటి ప్రభువు మైలారదేవిని ఇచ్చి వివాహం చేస్తూ, ఆచంట రామేశ్వరునికి పోకతోటలు సమర్పించినట్టు శాసనాలు చెప్తున్నాయి.[3]
ఆచంటలో ప్రజా వినోదనికై మూడు సినిమా ప్రదర్శన శాలలు ఉన్నాయి.
ఆచంటలో ప్రతి శుక్ర వారం సంత జరుగుతుంది. ఇది పరిసర గ్రామాలలోకెల్ల పెద్దసంత.
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 20,477.[2] ఇందులో పురుషుల సంఖ్య 10,235, మహిళల సంఖ్య 10,242, గ్రామంలో నివాసగృహాలు 5,036 ఉన్నాయి.2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5604 ఇళ్లతో, 19507 జనాభాతో 2101 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 9786, ఆడవారి సంఖ్య 9721. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3429 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 95. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588688[7].
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 18, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. సమీప బాలబడి ఆచంటలో ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల పాలకొల్లులో ఉంది. పాలీటెక్నిక్ పోడూరు లోను, మేనేజిమెంటు కళాశాల పెనుగొండలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల మార్టేరు లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, ఏలూరు లోనూ ఉన్నాయి.శ్రీ ముప్పన వీర రాఘవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల. ఇది రామేశ్వరస్వామి వారి ఆలయము యొక్క చెరువుకు ఆవలివైపున ఉంది.
ఆచంటలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. నాలుగు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. 8 మంది పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు 10 మంది ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
ఆచంటలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 20 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
ఆచంటలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
ఆచంటలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
ఆచంటలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
లేసులు