ఎస్.కె. మిశ్రో | |
---|---|
![]() | |
జననం | జనవరి 4, 1945 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | నాటకరంగ నటుడు, నాటక రచయిత, దర్శకుడు, |
జీవిత భాగస్వామి | సచలాదేవి మిశ్రో |
తల్లిదండ్రులు |
|
ఎస్.కె. మిశ్రో (సుశీల్ కుమార్ మిశ్రో) నటుడు, నాటక రచయిత, దర్శకుడు.
ఇతను 1945, జనవరి 4వ తేదీన శశి భూషణ్ మిశ్రో, సరోజిని దేవి దంపతులకు విశాఖపట్నంలో జన్మించాడు.
డిగ్రీ పాసయ్యాక పోర్టు ట్రస్ట్, విశాఖపట్నం లో ఉద్యోగంలో చేరాడు.
చదువుకునే రోజుల్లోనే (1960) నాటకాలలో నటిస్తూ పేరు సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని రంగస్థల కళలశాఖలో నటన, దర్శకత్వం పై పూర్తి అవగాహన పెంచుకొని, డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ పట్టా పొందాడు.
1956లో నవ్యభారతి కళామందిరం, 1968లో రసమయి నట సమాఖ్య సంస్థలను స్థాపించి, స్వీయ దర్శకత్వంలో నాటకాలు తయారుచేసే పరిషత్తులలో పాల్గొని ఉత్తమ ప్రదర్శనకు, నటనకు, దర్శకత్వానికి బహుమతులు సంపాదించారు. ఆంధ్ర యూనివర్సిటీ రంగస్థల కళలశాఖకు ప్రథమ దర్శకుడు కె. వెంకటేశ్వరరావు వద్ద వాచికం, నటన, దర్శకత్వ పోకడలు పుణికిపుచ్చుకున్నాడు.
1970లో ఢిల్లీలో 26 దేశాలు పాల్గొన్న కామన్ వెల్త్ యువజనోత్సవాలలో పాల్గొని గణేష్ పాత్రో రచించిన ‘పావలా’ నాటికను అత్యంత సమర్థవంతంగా ప్రదర్శించాడు. 1972లో ఢిల్లీలోని పూనా నేషనల్ ఇన్సిట్యూట్ నిర్వహించిన బహుభాషా నాటకోత్సవాలలో పాల్గొని, తను ప్రదర్శించిన ‘త్రివేణి’ నాటికకు ఉత్తమ ప్రదర్శన బహుమతి పొందటమే కాకుండా తను నటించిన నేస్తలింగం పాత్రకు ఉత్తమ నటుడి బహుమతి కూడా పొందాడు. మిశ్రో వాచికాభినంయం చాలా విభిన్నంగా ఉంటుంది. అవసరం మేరకు దృశ్యబంధ నిర్మాణం, రంగోద్దీపనం, పాత్రల కదలికలు, రంగస్థలంపై ఉన్న వస్తువులను వాడుకునే పద్ధతి, చాలా పకడ్బందీగా నిర్వహించేవాడు. మిశ్రో రచయితగా ప్రేమజీవులు, ద్రౌపది, పితృదేవోభవ నాటకాలను, ఆలోచించండి అనే నాటికను, కొన్ని గేయాలను రచించాడు.
అంతేకాదు తన నటనాపరిధిని విస్తృతి పరుచుకోవడానికి 1973లో ఆడది చిత్రంలో నటుడిగా ప్రవేశించి దాదాపు నలభై చిత్రాల్లో నటించాడు. మరో చరిత్ర (1978) సినిమాలో సరిత బావగా నటించాడు. [1]
నటించినవి
డిటెక్టివ్ సుబ్బారావు, మల్లాది రామకృష్ణ శ్రాస్త్రి కథలు, భరాగో కథలు, వండర్ బాయ్ మొదలైన టి.వి సీరియల్స్ లో కూడా నటించాడు.