కె. కె. సెంథిల్ కుమార్ | |
---|---|
జననం | |
విద్యాసంస్థ | ఫిల్ం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా |
వృత్తి | ఛాయాగ్రహణం |
బిరుదు | ఇండియన్ సొసైటీ ఫర్ సినిమాటోగ్రాఫర్స్ (ISC) |
జీవిత భాగస్వామి | రూహీ |
కె.కె.సెంథిల్ కుమార్ భారతీయ సినిమా ఛాయాగ్రాహకుడు. ఈయన ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తున్నాడు.
కె.కె.సెంథిల్ కుమార్ 1998లో డిగ్రీ చేసాడు. అతనికి కళాశాలలో క్రికెట్ ఆటపై ఆసక్తి ఉండేది. అతడు మంచి క్రికెట్ ఆటగాడు. కపిల్ దేవ్ను ఆయన రోల్ మోడల్ గా భావించాడు. తరువాత అతడు సివిల్ సర్వీసులలో చేరాలని అనుకున్నాడు. సివిల్ సర్వీసులకు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో అయన స్నేహితుడు సలహా మేరకు FTII (ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా) కు దరఖాస్తు చేసాడు. పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్ 3 సంవత్సరాల కోర్సును దర్శకత్వం, సౌండ్ రికార్డింగ్, ఎడిటింగ్, ఛాయాగ్రహణం విభాగాలలో ఇచ్చేది. అతడు చాయాగ్రహణం కోర్సులో దరఖాస్తు చేసాడు. వారు సంవత్సరానికి10 మంది విద్యార్థులను తీసుకొనేది. రెండు సీట్లు మూడవ ప్రపంచ దేశాలకు రిజర్వు చేసేవారు. ఈ సెలక్షన్ ఇంటర్వ్యూకు 40 మంది హాజరితే ఎంపిక కాబడిన 8 మందిలో అతను ఒకరు.[1]
అతను పూణె లోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి ఛాయాగ్రహణంలో డిగ్రీ పొందాడు.[2]
తరువాత ఆయనసినిమాటోగ్రాఫర్ గా ప్రస్థానాన్ని ఎంచుకున్నాడు. అతనికి సినీరంగ నేపథ్యం లేనందువల్ల కొంతకాలం ఖాళీగా ఉన్నాడు. అపుడు సినిమా చిత్రకారుడైన పున్నయ్య సలహాతో సినిమా ఛాయాగ్రాహకుడు శరత్ వద్ద అసిస్టెంటుగా చేరాడు.
అతడు అసిస్టెంట్ గా మొదటి చిత్రం 1999 లో విదుదలైన ప్రేమకు వేళాయెరా. తరువాత జాబిలి సినిమాలో అసిస్టెంట్ ఛాయాగ్రాహకునిగా పనిచేసాడు. అతడు టెలివిజన్ సీరియల్ అమృతం లో కెమేరామన్ గా అవకాశాన్ని ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఇచ్చాడు. ఇది సినిమా పరిశ్రమలో ఛాయాగ్రాహకునిగా ఎదగడానికి దోహదపడింది.[1]
అతడు 2003లో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన తెలుగు సినిమా ఐతే ద్వారా సినీ రంగప్రవేశం చేసాడు. ఆ చిత్రం తెలుగులో జాతీయ ఉత్తమ సినిమా పురస్కారాన్ని పొందింది. తరువాత ఆరునెలలు ఏ సినిమా కూడా లేకుండా ఎస్. ఎస్. రాజమౌళి తన సినిమా సైలో పనిచేసేందుకు ఆహ్వానించే వరకు ఖాళీగా ఉన్నారు.
అతనికి ఎక్కువగా ఎస్. ఎస్. రాజమౌళి చిత్రాలతో అనుబంధం ఉంది. ఆయన బాక్సాఫీస్ హిట్ చిత్రాలైన సై (2004), ఛత్రపతి (2005), యమదొంగ (2007), మగధీర (2009), ఈగ (2012), బాహుబలి:ద బిగినింగ్ (2015) లలో పనిచేసాడు.[3] 2012లో ఆయన ఛాయాగ్రహణం చేసిన ఈగ సినిమాకు SIIMA అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ పురస్కారం వచ్చింది.[4][5] జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించిన బాహుబలి సినిమాలకు సెంథిల్ కుమార్ ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.
అతడు తెలంగాణ లోని బొల్లారం,సికింద్రాబాదులో జన్మిచాడు. అతనికి గల ముగ్గురు సహోదరులలో అతడు పెద్దవాడు. అతని తండ్రి కృష్ణమూర్తి.
మగధీర సినిమా షూటింగ్ సమయంలో సెంథిల్, రూహీ మొదటి సారి కలుసుకొని ఆ తరువాత 2009లో వీరిద్దరూ పెద్దల అంగీకారంతో జూన్ 25న ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రూహి కొవిడ్-19 సమయం నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆమె ఆరోగ్యం క్షీణంచడంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయి 2024 ఫిబ్రవరి 15న మరణించింది.[6][7]
సంవత్సరం | సినిమా | భాష | దర్శకుడు |
---|---|---|---|
2003 | ఐతే | తెలుగు | చంద్రశేఖర్ యేలేటి |
2004 | సై | తెలుగు | ఎస్. ఎస్. రాజమౌళి |
2005 | ఛత్రపతి | తెలుగు | ఎస్. ఎస్. రాజమౌళి |
2006 | అశోక్ | తెలుగు | సురేందర్ రెడ్డి |
2007 | యమదొంగ | తెలుగు | ఎస్. ఎస్. రాజమౌళి |
2008 | త్రీ | తెలుగు | శేఖర్ సూరి |
2009 | అరుంధతి | తెలుగు | కోడి రామకృష్ణ |
2009 | మగధీర | తెలుగు | ఎస్. ఎస్. రాజమౌళి |
2010 | తకిట తకిట | తెలుగు | శ్రీహరినాయుడు |
2011 | గోల్కొండ హైస్కూల్ | తెలుగు | ఇంద్రగంటి మోహన కృష్ణ |
2012 | ఈగ | తెలుగు | ఎస్. ఎస్. రాజమౌళి |
2013 | రఫ్ | తెలుగు | సి.హెచ్.సుబ్బారావు |
2015 | బాహుబలి:ద బిగినింగ్ | తెలుగు | ఎస్. ఎస్. రాజమౌళి |
2017 | బాహుబలి ద కంక్లూజన్ | తెలుగు | ఎస్. ఎస్. రాజమౌళి |
2018 | మామాంకం | మలయాళం | సంజీవ్ పిళ్లై |
2019 | కర్ణన్ | మలయాళం | ఆర్.ఎస్.విమల్ |
2022 | ఆర్.ఆర్.ఆర్ | తెలుగు | ఎస్. ఎస్. రాజమౌళి |