ధరణి కోట వంశము | |
---|---|
1108–1268 | |
స్థాయి | సామ్రాజ్యము |
రాజధాని | ధరణికోట (గుంటూరు) |
సామాన్య భాషలు | తెలుగు |
మతం | జైన మతం |
ప్రభుత్వం | సార్వభౌమ(ఏకవ్యక్తి) పాలన |
చరిత్ర | |
• స్థాపన | 1108 |
• పతనం | 1268 |
కోట వంశం ఒక మధ్యయుగ రాజవంశం. ఆధునిక భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో పాలించింది . కోటలు ధనంజయ గోత్రానికి చెందినవి. ధరణికోటను రాజధానిగా చేసుకుని కమ్మనాడని పాలించారు.కోట రాజులు మొదటి క్షత్రియ వర్ణానికి చెందినవారు.[1]
కోట రాజులు మొదట్లో జైన మతాన్ని ఆచరించినా తర్వాత కాలంలో చాళుక్యుల వలె హిందూ మతాన్ని కూడా ఆచరించారు. శైవ తత్వాన్ని కూడా ప్రోత్సహించారు. వీరికి తూర్పు చాళుక్యులతోను, సూర్యవంశీయులైన కాకతీయులతోను వివాహ సంబంధాలుండేవి. కాకతీయ గణపతి దేవుని రెండవ కుమార్తె అయిన గణపాంబను కోట బేతరాజు వివాహమాడాడు. మంగళగిరి ఆనందకవి (జీవించిన కాలము క్రీస్తుశకం 1700) తాను వ్రాసిన 'విజయనందన విలాసము' లో హరిసీమకృష్ణ వంశీకుడు, జమీందారు అయిన దాట్ల వెంకటకృష్ణమరాజును కీర్తిస్తూ, హరిసీమ కృష్ణుడు చంద్రవంశానికి చెందినవాడని వ్రాయబడినది [2]. క్రీస్తు శకము 1182 ప్రాంతంలో జరిగిన పల్నాటి యుద్ధంలో నలగామరాజుకు సహాయం చేయడానికి కాకతీయ రుద్రదేవరాజు కొంత సైన్యాన్ని పంపాడు. ఈ సైన్యం ధరణికోటను ముట్టడించి జయించింది. కోట దొడ్డభీమరాజు మరణించాడు. ఆనాటి నుండి కోట వంశీయులు కాకతీయులకు సామంతులయ్యారు. 1323 వ సంవత్సరంలో మహమ్మదీయుడైన ఉయిన్ ఖాన్ కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మూలించాడు. ఆ సందర్భంలో కోట వంశం కూడా రాజ్యం కోల్పోయింది.
కోట సామ్రాజ్యాన్ని పాలించిన రాజులు:
కోట రాజులు ఈ క్రింది బిరుదు గద్యమును ఉత్సవ సందర్భాల్లో ఉచ్చరించేవారు:
స్వస్తి సమస్త పంచ మహా శబ్ద మహామండలేశ్వర| రాజ పరమేశ్వర| ఈశ్వర పదవీ విరాజమాన| విజయవినోద| .... మల్ల చోళ సింహ చోళ, శార్దూల| మత్త మాతంగ| హరిరాయాస్తాన గజసింహ| బౌద్ధకండకుద్దాల| పాండియరాయమగ| ధనుంజయ గోత్ర పవిత్ర| ... రాజు పేరు జగమొచ్చు గండండు| బంటు పేరు పగమెచ్చు గండండు| ఖడ్గం పేరు కాలమృత్యువు| రేవు పేరు పాప వినాశనంబు| నదిపేరు కృష్ణవేణి| దేవర పేరు అమరేశ్వర దేవుండు| పట్టణంబు పేరు ధరణాల కోట| వాటి పేరు ధన్య వాటి| వీటి పేరు గండరగండ వీడు| పడగ పేరు గండభేరుండ| .... అంబ దేవర భూపాలుండు మొదలైన శ్రీ కోట రాజుల అన్వయ ప్రశస్తి| విజయీభవ| దిగ్విజయీభవ !! [3].