గవాంబోధి రాగముకర్ణాటక సంగీతంలో ఒక రాగము. ఇది 72 మేళకర్త రాగాల జాబితాలో 43వ మేళకర్త రాగము.[1][2] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాఅలలో ఈ రాగాన్ని :"గీర్వాణి లేదా గిర్వాణీ" అని పిలుస్తారు.
ఆరోహణ: స రిగా మ ప ధని స
(S R1 G2 M2 P D1 N1 S)
అవరోహణ: సని ధ ప మగా రి స
(S N1 D1 P M2 G2 R1 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, శుద్ధ నిషాధం. ఈ సంపూర్ణ రాగం 7వ మేళకర్త రాగమైన సేనావతి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.