చిరునవ్వుతో (2000 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | జి.రాంప్రసాద్ |
తారాగణం | తొట్టెంపూడి వేణు, షహీన్, ప్రకాష్ రాజ్ |
సంగీతం | మణి శర్మ |
నిర్మాణ సంస్థ | ఎస్పీ. ఎంటర్టైన్మెంట్ |
భాష | తెలుగు |
చిరునవ్వుతో 2000లో జి. రాంప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం.[1] వేణు, షహీన్ ఇందులో ప్రధాన పాత్రధారులు.
వేణు ఒక పాకశాస్త్ర ప్రవీణుడు.తన మామ (చంద్రమోహన్) కూతురైన అరుణ (ప్రేమ)తో పెళ్ళి నిశ్చయం అవుతుంది. కానీ అరుణ ఎవరినో ప్రేమించి అతన్ని పెళ్ళి చేసుకోవడం కోసం ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతుంది. అందరూ వేణు మీద జాలి చూపిస్తుంటే అతను మాత్రం దాన్ని తేలిగ్గా తీసుకుంటాడు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ప్రధమ చిత్రంగా బంగారు నంది అవార్డు కు 2000వ సంవత్సరంఎంపికైంది.
క్ర.సం | పాట | గీత రచయిత | గాయకులు |
---|---|---|---|
1 | "అందం నీ పేరా" | భువనచంద్ర | ఉదిత్ నారాయణ్, ప్రసన్న |
2 | "హొయ్యారే హొయ్యారే అందానికి జోహారే" | భువన చంద్ర | శంకర్ మహదేవన్ |
3 | "కనులు కలిశాయి కథలు తెలిశాయే" | భువన చంద్ర | చిత్ర, హరిహరన్ |
4 | "నిన్నలా మొన్నలా లేదురా" | సిరివెన్నెల సీతారామ శాస్త్రి | ఎస్. పి. చరణ్[2] |
5 | "సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా" | సిరివెన్నెల సీతారామ శాస్త్రి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం |
6 | "సోనారే సోనారే" | భువన చంద్ర | చిత్ర, శంకర్ మహదేవన్ |
7 | "చిరునవ్వుతో " | సిరివెన్నెల సీతారామ శాస్త్రి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం |