జబర్మల్ శర్మ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ పాత్రికేయుడు, చరిత్రకారుడు. మహారాణా మేవార్ అవార్డు గ్రహీత. చరిత్రపై హిందీలో అనేక పుస్తకాలు రాశారు. 1982లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.[1]
ఇతని రచనలలో గులేరీ గ్రంథవళి (మూడు సంపుటాలు), సికార్ కా ఇతిహాస్ ఉన్నాయి.
ఝబర్మల్ శర్మ జ్ఞాపకార్థం రాజస్థాన్ పత్రిక, భోపాల్ లోని మఖన్ లాల్ చతుర్వేది నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ సంయుక్తంగా స్మారక ఉపన్యాసాన్ని నిర్వహిస్తున్నాయి. "పండిట్ ఝబర్మల్ శర్మ జర్నలిజం అవార్డు"ను జైపూర్ లోని ఝబర్మల్ శర్మ మ్యూజియం అండ్ జర్నలిజం రీసెర్చ్ సెంటర్ అందిస్తుంది.
హిందీ సాహిత్యానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 1977లో రాజస్థాన్ మంచ్ ఆయన గౌరవార్థం "పండిట్ ఝబర్ మల్ శర్మ అభినందన్ గ్రంథ్" అనే పుస్తకాన్ని ప్రచురించింది.