National Highway 167 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
ఎన్హెచ్ 67 యొక్క సహాయక మార్గం | ||||
పొడవు | 483 కి.మీ. (300 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
పశ్చిమ చివర | హగరి | |||
తూర్పు చివర | కోదాడ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | హగరి, ఆలూరు, ఆదోని, యెమ్మిగనూరు, మంత్రాలయం, రాయచూర్, మఖ్తల్, మహబూబ్నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, దేవరకొండ, నిడమనూరు, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ. | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 167 (ఎన్హెచ్ 167), భారతదేశంలోని జాతీయ రహదారి. ఇది ఉన్నతీకరణ ద్వారా కొత్తగా ఏర్పడిన ఈ జాతీయ రహదారి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళుతుంది.కర్ణాటకలోని హగరిలో ప్రారంభమై తెలంగాణలోని కోదాడ్లో ముగుస్తుంది. ఇది జాతీయ రహదారి 67 కి ద్వితీయ మార్గం.[1][2][3][4]
ఇది హగరి జంక్షన్ వద్ద ప్రారంభమై తెలంగాణలోని ఆలూరు, ఆదోని, యెమ్మిగనూరు, మంత్రాలయం, రాయచూర్, మహబూబ్నగర్, జడ్చర్ల , కల్వకుర్తి, దేవరకొండ, కొండ మల్లె పల్లి , హాలియా, నిడమానూరు, మిర్యాలగూడ, హుచ్చెర్ల మీదుగా కోదాడ వెళుతుంది.[2][4][5]
కృష్ణా నదిపై ఉన్న సీరత్-ఎ-జోడి వంతెనను 1933, 1943 మధ్య కాలంలో నిర్మించారు. హైదరాబాద్ యువరాజు నవాబ్ జవ్వద్జహా బహదూర్ గౌరవార్థం ఈ వంతెనకు సీరత్-ఎ-జోడీ అని పేరు పెట్టారు. రాయచూరు లోని శక్తినగర్ సమీపంలో ఉన్న 80–81 సంవత్సరాల ఈ వంతెన 2,488 అడుగులు (758 మీ.) పొడవు, 20 అడుగుల వెడల్పుతో, కృష్ణా నదీగర్భం నుండి 60 అడుగుల ఎత్తున ఉంది.[6]