టి.ముక్త | |
---|---|
![]() తంజావూరు ముక్త | |
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | తంజావూరు ముక్త |
జననం | 1914 |
మూలం | మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా |
మరణం | 2007 (aged 92–93) |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | గాత్రవిద్వాంసురాలు |
వాయిద్యాలు | గాత్రం, సరస్వతి వీణ |
తంజావూరు ముక్త(1914–2007) సంగీత విద్వాంసురాలు. ఈమె తన సోదరి టి.బృందతో కలిసి గాత్రయుగళ కచేరీలు చేసింది. ఈ జంట కర్ణాటక సంగీత చరిత్రలో యుగళకచేరీలు మొదటి మహిళాద్వయంగా పేరుపొందింది.[1][2] వీరిది వీణ ధనమ్మాళ్ సాంప్రదాయం.
ముక్త తన సంగీత పాఠాలు తన తల్లి కామాక్షి వద్ద వీణ ధనమ్మాళ్ పద్ధతిలో నేర్చుకుంది. ఈ బాణీ సూక్ష్మ గమకాలతో అనుస్వరాలతో నిండి ఉంటుంది. తల్లి వద్ద శిక్షణ పొందిన తర్వాత తన సోదరి బృందతో కలిసి కాంచీపురం నయన పిళ్ళై,[3]లక్ష్మీరత్నం, వీణధనమ్మాళ్ల వద్ద తన సంగీతాన్ని మెరుగుపరచుకొంది. ఈమె తన 8వ యేట మొదటి కచేరీ చేసింది. 2003లో క్లీవ్లాండ్ (అమెరికా)లో ఈమె తన చిట్టచివరి కచేరీ చేసింది.[4][5]ఈమె ఎక్కువగా పదములను, జావళీలను ప్రాచుర్యంలోనికి తెచ్చింది.
ఈమె శిష్యబృందంలో సుభాషిణి పార్థసారథి, నిర్మల సుందరరాజన్, మైసూర్ నాగమణీ శ్రీనాథ్, ఉమా వాసుదేవన్ (కుమార్తె) మొదలైన వారున్నారు.
ఈమె 1972లో సంగీత నాటక అకాడమీ అవార్డును పొందింది.[6][7]
ఈమె తన 93వయేట 2007లో మరణించింది. ఈమె శతజయంతి ఉత్సవాలను 2014లో చెన్నైలో జరుపుకున్నారు.