డెన్నిస్ జోసెఫ్ | |
---|---|
జననం | ఎట్టుమనూరు, కొట్టాయం జిల్లా, కేరళ | 1957 అక్టోబరు 20
మరణం | 2021 మే 10 ఎట్టుమనూరు, కొట్టాయం జిల్లా, కేరళ | (వయసు 63)
విద్యాసంస్థ | దేవ మాత కళాశాల, కురవిలంగాడ్ (బిఎస్సీ) |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1985–2021 |
జీవిత భాగస్వామి | లీనా |
పిల్లలు | 3 |
డెన్నిస్ జోసెఫ్ (1957, అక్టోబరు 20 - 2021 మే 10)[1][2] కేరళకు చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. మలయాళ సినిమారంగంలో కృషి చేశాడు.
డెన్నిస్ 1957, అక్టోబరు 20న ఎంఎన్ జోసెఫ్ - ఎలియమ్మ జోసెఫ్ దంపతులకు కేరళ రాష్ట్రం, కొట్టాయం జిల్లా, ఎట్టుమనూరులో జన్మించాడు.[3] తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పని చేయగా, అతని తల్లి స్థానిక ఉపాధ్యాయురాలిగా పనిచేసింది.[4] ఇతని మేనమామలు జోస్ ప్రకాష్, ప్రేమ్ ప్రకాష్ లు సినీ నటులు.[5] 1974 శాపమోక్షం సినిమా నిర్మించిన ఫ్రాన్సిస్ ప్రకాష్కి మేనల్లుడు.[4] డెన్నిస్ ఎట్టుమనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివాడు. కురవిలంగాడ్ లోని దేవ మాత కళాశాలలో కెమిస్ట్రీలో డిగ్రీ చదివాడు.[3][4]
డెన్నిస్ కు లీనాతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు - ఎలిజబెత్, రోస్సీ, జోస్ ఉన్నారు.[6]
సినీ దర్శకులు జోషి,తంబి కన్నంతనంతో కలిసి పనిచేశాడు. నిరక్కూట్టు (1985), రాజవింటే మకన్ (1986), శ్యామా (1986), న్యూఢిల్లీ (1987), నెం.20 మద్రాస్ మెయిల్ (1990), కొట్టాయం కుంజచ్చన్ (1990), ఇంద్రజాలం (1990), అప్పు (1990), ఆకాశదూతు (1993), పాలయం (1994), ఎఫ్ఐఆర్ (1999) వంటి సినిమాలకు స్క్రిప్ట్ని అందించాడు. మను అంకుల్ సినిమాతోపాటు ఐదు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇది 1988లో ఉత్తమ పిల్లల చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును, 1989లో ఉత్తమ బాలల చిత్రంగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
సంవత్సరం | పేరు | రచన |
---|---|---|
1988 | మను అంకుల్ | శిబు చక్రవర్తి |
1989 | అధర్వం | |
1990 | అప్పు | శ్రీకుమారన్ థంపి |
1991 | తుడార్ కథ | |
1995 | అగ్రజన్ |
కోవిడ్-19 కారణాంగా 2021, మే 10న కొట్టాయంలో మరణించాడు.[7][3][8][5][9][10]