తెలంగాణ శాసనసభ | |
---|---|
3వ తెలంగాణ శాసనసభ | |
రకం | |
రకం | తెలంగాణ శాసనసభ ద్విసభ శాసనసభ |
కాల పరిమితులు | 2023-2028 |
చరిత్ర | |
స్థాపితం | 2 జూన్ 2014 |
అంతకు ముందువారు | తెలంగాణ శాసనసభ |
నాయకత్వం | |
జిష్ణు దేవ్ వర్మ 2024 జులై 31 నుండి | |
శాసనమండలి కార్యదర్శి | వి.నరసింహా చార్యులు 2017 సెప్టెంబరు 1 నుండి |
డిప్యూటీ స్పీకర్ | ఖాళీ 2023 డిసెంబరు 3 నుండి |
నిర్మాణం | |
సీట్లు | 119 |
![]() | |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం (69)
అధికారిక ప్రతిపక్షం (34)
పార్లమెంటరీ ప్రతిపక్షం (15) ఖాళీ (1)
|
కాలపరిమితి | 2023 – 2028 |
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ ఓటింగ్ |
మొదటి ఎన్నికలు | 2014 ఏప్రిల్ 30 |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2023 నవంబరు 30 |
తదుపరి ఎన్నికలు | 2028 |
సమావేశ స్థలం | |
![]() | |
అసెంబ్లీ భవనం, హైదరాబాద్, తెలంగాణ |
తెలంగాణ రాష్ట్ర శాసన సభ రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో దిగువ సభ. ఈ సభ ప్రస్తుతం 119 శాసన సభ్యులతో ఉంది.[1]
విధానసభ సభ్యులు నేరుగా వయోజన ఓటు హక్కు ఉన్న ప్రజలచే ఎన్నుకోబడతారు. ప్రతి నియోజకవర్గం నుండి ఒక అసెంబ్లీ సభ్యుడును, పోటీ చేసిన అభ్యర్థులలోకెల్ల ఎక్కువ ఓట్లను పొందిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటింపబడును. సభ్యుడిని "శాసనసభ సభ్యుడు" అని పిలుస్తారు. ఎన్నికలను భారతదేశ ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
సభ్యుల పదవికాలం ఐదేళ్లు ఉంటుంది. సభ్యుడు మరణించనపుడు, రాజీనామా లేదా అనర్హత విషయాలు జరిగినప్పుడు ఉపఎన్నిక నిర్వహించి, సభ్యుడిని ఎన్నిక చేస్తారు. ఈ ఎన్నికలలో అధిక స్థానాలను పొందిన పార్టీ అధికార పార్టీ అవుతుంది .ఈ ఎన్నికలను గరిష్ఠంగా అరు నెలల కాలవ్యవది లోపు జరపాలి అని జాతీయ ఎన్నికల కమిషన్ లో పొందుపరిచారు
2014 జూన్లో తెలంగాణ ప్రత్వేక రాష్ట్ర ఏర్పడి, 119 శాసనసభ స్థానాలతో తెలంగాణ శాసనసభ ఉనికిలోకి వచ్చింది.2023 వరకు ఆంగ్లో-ఇండియా సంఘం నుండి ఒక నామినేట్ సభ్యుడు ఉన్నారు.
సాధారణంగా శాసనసభ ఏడాదిలో మూడుసార్లు సమావేశమవుతాయి. బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల, శీతాకాల సమావేశాలు జరుగుతుంటాయి. ఈ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలనేది స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ (బీఏసీ) తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. బీఏసీ ప్రతిపాదనల మేరకు సభ ఎన్ని రోజులు జరుగుతుందనేది విషయంపై స్పీకర్ కార్యాలయం ప్రకటన చేస్తుంది.
ఏదేని పరిస్థితులలో శాసనసభ త్వరగా రద్దు కాకపోతే, మొదటి సమావేశానికి నియమించబడిన తేదీ నుండి శాసనసభ కాలవ్యవధి ఐదు సంవత్సరాలు ఉంటుంది. శాసనసభ ప్రధాన విధులు చట్టాన్ని రూపొందించడం, పరిపాలనను పర్యవేక్షించడం, బడ్జెట్ను ఆమోదించడం, ప్రజా ఫిర్యాదులను ప్రసారం చేయడం.
ప్రజలు ఎన్నుకున్న శాసనసభలో ప్రస్తుతం 119 మంది శాసనసభ్యులు ఉన్నారు. రాష్ట్రం దాదాపు సమాన జనాభాతో 119 నియోజకవర్గాలుగా విభజించబడింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ క్రింది కారణాలతో ఎన్నికలు ముందుగా జరగటానికి కూడా అవకాశాలు ఉన్నాయి.
హోదా | పేరు |
---|---|
గవర్నర్ | సి. పి. రాధాకృష్ణన్ (అదనపు ఛార్జీ) (బిజెపి) |
స్పీకర్ | గడ్డం ప్రసాద్ కుమార్ (INC) |
డిప్యూటీ స్పీకర్ | ఖాళీ |
సభా నాయకుడు (ముఖ్యమంత్రి) |
ఎనుముల రేవంత్ రెడ్డి (INC) |
సభ ఉప నాయకుడు (ఉపముఖ్యమంత్రి) |
మల్లు భట్టివిక్రమార్క (INC) |
ప్రతిపక్ష నాయకుడు | కె. చంద్రశేఖర్ రావు (BRS) |
పార్టీ | సభ్యులు | |
---|---|---|
Indian National Congress | 68 | |
Bharat Rashtra Samithi | 34 | |
Bharatiya Janata Party | 8 | |
All India Majlis-e-Ittehadul Muslimeen | 7 | |
Communist Party of India | 1 | |
ఖాళీ | 1 | |
మొత్తం సభ్యులు | 119 |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)