తోట నరసింహం | |||
లోక్ సభ సభ్యులు
తెలుగుదేశం లోక్సభా పక్ష నేత | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2 June 2014 | |||
ముందు | మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు | ||
---|---|---|---|
నియోజకవర్గం | కాకినాడ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
[[జూన్ 5]], 2014నాటికి |
తోట నరసింహం ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు. 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు[1]. ఈ ఎన్నికలో అతను సమీప వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పై గెలుపొందాడు.[2][3] ప్రస్తుతం ఈయన తెలుగుదేశం పార్టీ లోక్ సభ నేతగా ఉన్నారు.
అతను 1962 జూన్ 6 న తోట వరహాలయ్య, పద్మాక్షమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన బి.కామ్ వరకు చదివాడు.[4] అతనికి 1986 నవంబరు 25 న తోట సరస్వతి (వాణి) తో వివాహమైంది. అతనికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.[5]
తోట నరసింహం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు రెండు సార్లు ఎన్నికైనాడు. మొదట 2004-2006లో, రెండవసారి 2009-2014 లో ఎన్నికైనాడు. అతను 2010 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్నాడు. అతను 2014లో 16వ లోక్ సభకు ఎన్నికైనాడు అతను లోక్ సభలో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ, రైల్వేల స్టాండింగ్ కమిటీలకు సభ్యునిగానూ, జనరల్ పర్పస్ కమీటీకి కూడా సభ్యునిగా ఉన్నాడు. అతను పెట్రోలియం సహజ వాయువుల శాఖకు మంత్రిగా ఉన్నాడు. అతను తెలుగు దేశం లోక్ సభాపక్ష నేతగా కూడా వ్యవహరించాడు[5]
Party political offices | ||
---|---|---|
అంతకు ముందువారు నామా నాగేశ్వరరావు |
Leader of the Telugu Desam Party in the 16th Lok Sabha 2014–present |
Incumbent |