పట్టణం | |
![]() | |
Coordinates: 16°47′00″N 80°18′00″E / 16.7833°N 80.3°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఎన్టీఆర్ జిల్లా |
మండలం | నందిగామ మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 25.9 కి.మీ2 (10.0 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 44,359 |
• సాంద్రత | 1,700/కి.మీ2 (4,400/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1002 |
Area code | +91 ( 08678 ![]() |
పిన్(PIN) | 521185 ![]() |
Website |
నందిగామ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలానికి చెందిన పట్టణం. ఇది నగరపంచాయితి. ఇది సమీప పట్టణం జగ్గయ్యపేట నుండి 46 కి. మీ. దూరంలో ఉంది.
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 11575 ఇళ్లతో, 44359 జనాభాతో 2590 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 22153, ఆడవారి సంఖ్య 22206. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 7954 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2142. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588883. 2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం కృష్ణా జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది..[2][3]
ఇది 2011 కు ముందు మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది. 2011 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమీప గ్రామాలు అనాసాగరం, హనుమంతులపాలెంలను దీనిలో కలిపి నగరపంచాయితిగా మార్చింది. నందిగామ నగరపంచాయితి పరిదిలో 20 ఎన్నికల వార్డులు ఉన్నాయి .
జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జగ్గయ్యపేట, విజయవాడ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. దగ్గరలోని రైల్వేస్టేషన్ విజయవాడ 50 కి.మీ దూరంలో వుంది, మధిర 17 కి.మి.దూరంలో ఉంది.
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 17, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు 13, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు 8, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు 12 ఉన్నాయి. 3 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 6 ప్రైవేటు జూనియర్ కళాశాలలు 3 ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు, 2 ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ఉంది.ఒక ప్రభుత్వ పాలీటెక్నిక్ ఉంది. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, ఉన్నాయి. సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడలో ఉంది.
ఇంతవరకు ఈ పాఠశాలలో బ్రిటిష్ వారు నిర్మించిన గదులలోనే విద్యా బోధన చేస్తున్నారు. ఇప్పుడు 42.5 లక్షల ఆర్.ఎం.ఎస్.ఏ. నిధులతో, నూతన గదులు నిర్మించారు. ఈ గదులను వచ్చే వార్షికోత్సవంనాడు ప్రారంభించెదరు. ప్రస్తుతం ఈ పాఠశాలలో, ఆరవతరగతి నుండి పదవ తరగతి వరకు 476 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. 120 మంది పదవ తరగతిలో ఉన్నారు. నందిగామలో ప్రభుత్వ విద్యార్థి వసతి గృహాలు ఉండటంతో, దూరప్రాంతాలనుండి వచ్చిన విద్యార్థులు, ఆ వసతి గృహాలలో బసచేయుచూ, ఈ పాఠశాలలో విద్యనభ్యసించుచున్నారు. 2015-16 విద్యాసంవత్సరంలో పదవ తరగతి వ్రాసిన విద్యార్థులు, 90% ఉత్తీర్ణత శాతం సాధించారు. పాఠశాల పూర్వ విద్యార్థి, విశ్రాంత ఐ.ఏ.ఎస్. అయిన శ్రీ చెన్నావఝుల శ్రీరామచంద్రమూర్తి, ఈ పాఠశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతి సంవత్సరం, 25వేల రూపాయల నగదు బహుమతులను అందించుచున్నారు.
తెలుగు పద్య నాటకం ఉన్నంత వరకు, బళ్ళారి రాఘవ పేరు చిరస్థాయిగా నిలిచిపోవును. నందిగామలో ఆ మహానుభావుని పేరుమీద, ఈ సంస్థను 50 సంవత్సరాలక్రితం స్థాపించారు. దీని వ్యవస్థాపకులు గోపాల కృష్ణసాయి. ఈ సంస్థలో ప్రతి సంవత్సరం బళ్ళారి రాఘవ జయంతిని ఘనంగా నిర్వహించుచున్నారు. ఈ సంస్థ స్థాపించినప్పటి నుండి, దాతల సహకారంతో, కళారంగంలో పేరుపొందిన ప్రముఖుల జయంతి, వర్ధంతులను క్రమం తప్పకుండా నిర్వహించుచున్నారు. ఈ సంస్థ స్వర్ణోత్సవ వేడుకలు, 2014, ఆగస్టు-9న స్థానిక ఏ.ఎం.సి. కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ప్రసంగించి, బళ్ళారి రాఘవ నాటకరంగానికి చేసిన కృషిని కొనియాడినారు. ఆరోజు సాయంత్రం ఆరు గంటలకు కళాకారులు జాతీయ, దేశభక్తి, అభ్యుదయ గీతాలు ఆలపించారు. అనంతరం ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి
అనాసాగారం గ్రామం జాతీయ రహదారి 9కి ఆనుకొని ఉంది, ఇది నందిగామ నుండి రెండు కి.మీ.ల దూరంలో ఉంది. ఇప్పుడు ఈ గ్రామం నందిగామలో పూర్తిగా కలిసిపోయింది. ఈ గ్రామం ఇప్పుడు నందిగామలో ఒక వార్డుగా ఉంది. అనాసాగారంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 తరగతి వరకు విద్యాబోధన జరుగుతుంది. ఇతర గ్రామాల నుండి కూడా విద్యార్థులు ఈ పాఠశాలకు హాజరు అవుతారు. ఈ పాఠశాల కొర్లపాటి చిన్నమల్లయ్య ప్రోద్భలంతో నిర్మించబడింది. ఆ తరువాత వివిధ రాజకీయ నాయకులు దీని అభివృద్ధికి తొడ్పడ్డారు.
వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, సుమారుగా 400 సంవత్సరాల క్రితం కట్టించారు. ఈ దేవాలయంలో నాలుగు దిక్కులా రామేశ్వర, సోమేశ్వర, భీమేశ్వర, చంద్రమౌళీశ్వర స్వామివారల ఉపాలయాలున్నవి. మధ్యలోని ప్రధానాలయంలో శ్రీ రామలింగేశ్వరస్వామివారు కొలువుదీరి ఉండటంతో, ఈ దేవాలయము పంచలింగక్షేత్రము గా ప్రసిద్ధిచెందినది. అందువలన నందిగామ అను పేరువచ్చినది ఈ ఆలయానికి 275 ఎకరాల మాన్యం భూములున్నవి. ఆ భూముల వలన ప్రతి సంవత్సరం ఆలయానికి లక్షల రూపాల ఆదాయం వచ్చుచున్నది. ఈ ఆలయము ఇప్పుడు దేవాదాయధర్మాదాయ శాఖవారి ఆధీనములోఉండి వాసిరెడ్డి రామనాథబాబు ధర్మకర్తగా ఉన్నారు. ఈ దేవాలయములో ప్రతిపూర్ణిమకు, మాసశివరాత్రికి ప్రత్యేకపూజలు జరుగుతాయి కార్తీక మాసంలో ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ఆ మాసమందు నెలరోజుల పాటు భక్తుల గోత్ర నామాలతో అభిషేకాలు, కార్తీక పూర్ణిమ రోజు జ్వాలాతోరణము, కార్తీక మాస శివరాత్రిరోజు లక్షబిళ్వార్చన చాలా బాగా జరుగును.
ఈ ఆలయంలో శ్రీరామనవమికి శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. 2011వ సంవత్సరంలో జరిగిన కల్యాణం, గవర్నరు, ఇ.యస్.యన్.ల్. నరసింహన్ చేతుల మీదుగా జరిగటం విశేషం..
నందిగామలోని 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని, పుష్కర నిధులు విరాళాలు, 26 లక్షలతో నూతనంగా పునర్నిర్మించారు. నూతన ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం, 2017,ఏప్రిల్-22వతేదీ శనివారంనాడు వేదపండితుల మంత్రోచ్ఛారణలతో, వైభవోపేతంగా నిర్వహించారు. ప్రధాన ఆలయంలో శ్రీ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రుల మూల విరాట్టును, యంత్రాన్నీ ప్రతిష్ఠించారు. జీవధ్వజస్తంభం, ఆంజనేయస్వామి, విఖనస మహర్షి, రామానుజస్వామి, రాధాకృష్ణులు, విమాన శిఖరాలను ప్రతిష్ఠ చేసారు. సమీపగ్రామాలనుండి ఆలయానికి వచ్చిన వేలాదిమంది భక్తులతో ఆలయ ఆవరణ క్రిక్కిరిసినది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేసారు. [12]
ఈ ఆలయం పునఃప్రతిష్ఠించి, 40 రోజులైన సందర్భంగా, 2017,జూన్-1వతేదీ గురువారం రాత్రి, స్వామివారి ఉత్సవమూర్తులకు కనులపండువగా పుష్పయాగం నిర్వహించారు.
ఈ దేవాలయంను రాష్ట్ర ప్రథమ స్పీకరు అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు నిర్మించారు. ఈ దేవాలయం శిథిలం చెందగా, మరల వారి కుమారులు కృష్ణమోహనరావు, దుర్భాకుల సుబ్రహ్మణ్యకామేశ్వర ఘనపాఠిగారి పర్యవేక్షణలో పునర్నిర్మాణంకావించీ, అమ్మవారి మూల విరాట్టుతో సహా ప్రతిష్ఠలు చేయించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.
నందిగామలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
నందిగామలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
నందిగామలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
బియ్యం, పప్పులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
నందిగామ మండలంలోని అందరు లబ్ధిదారులకూ గ్యాస్ కనెక్షన్లు అందిన సందర్భంగా, 2017, జూన్-1న మండలాన్ని, పొగరహిత మండలంగా ప్రకటించారు.