Nunna
నున్న | |
---|---|
Coordinates: 16°34′35″N 80°41′07″E / 16.5763°N 80.6854°E | |
Country | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | Vijayawada (rural) |
జనాభా (2011)[1] | |
• Total | 14,176 |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 521212 |
టెలిఫోన్ కోడ్ | 0866 |
Vehicle registration | AP–16 |
Lok Sabha constituency | Machilipatnam |
Vidhan Sabha constituency | Gannavaram |
నున్న, కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన గ్రామం. విజయవాడ పొరుగు ప్రాంతం.
ఈ గ్రామానికి సమీపంలో సూరంపల్లి, ముస్తాబాద్, అంబాపురం, పాయకపురం గ్రామాలు ఉన్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా ఉంది. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం అనేవి ఉన్నాయి.
విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, పైదూరుపాడు, ప్రసాదంపాడు, ఫిర్యాది నైనవరం, బోడపాడు, రామవరప్పాడు, రాయనపాడు, వేమవరం, షహబాదు, సూరాయ పాలెం గ్రామాలు ఉన్నాయి.
2017 మార్చి 23 న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవెలప్మెంట్ డిపార్ట్మెంట్ జి.ఓ. 104 ప్రకారం, ఇది విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా మారింది.[3]
ఒకప్పుడు ఈ గ్రామంలో నూనె గానుగలు (అంటే వివిధ రకాల విత్తనాలతో నూనె తయారుచేసే యంత్రం లేక వ్యవస్థ) ఎక్కువగా ఉండేవి, ఆ క్రమంలో నూనె అనే పదము కాల క్రమేణా నున్నగా రూపాంతరం చెందింది
ఇది సముద్ర మట్టంనుండి 21 మీ.ఎత్తులో ఉంది.
నున్న గ్రామం విజయవాడ - నూజివీడు మార్గంలో, విజయవాడ పట్టణం నుండి సుమారుగా 12కిలోమీటర్ల దూరములో ఉంది. విజయవాడ నగర పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామం గనుక పట్టణం రూపురేఖలు ప్రబలంగా కనిపిస్తాయి.
ఈ గ్రామానికి సమీపంలో సూరంపల్లి, ముస్తాబాద్, అంబాపురం, పాతపాడు, అడివి నెక్కలం గ్రామాలు ఉన్నాయి.
విజయవాడ రైల్వస్టేషన్ గ్రామం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది, 15 నిముషాల జర్నీ సమయం పడుతుంది, విజయవాడ విమానాశ్రయం గ్రామానికి 20 కిలోమీటర్ల దూరమలో ఉంది, విజయవాడ లోని పండిట్ నెహ్రూ బస్సు స్టేషన్ నుంచి సౌత్ ఇండియా మొత్తానికి ఎటు వైపు అయినా వెళ్లగలిగే వీలు ఉంది, వీటితో పాటు అనేక ప్రయివేట్ ట్రావెల్స్ సంస్థల బస్సులు అందుబాటులో ఉన్నాయి.రామవరప్పాడు, గుణదల నుండి రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. ఇది నూజీవీడు - విజయవాడ రాష్ట్ర రహదారిపై ఉంది. నున్న నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీపంలోని విజయవాడ నున్నకు సమీప నగరంగా ఉంది. ఈ గ్రామానికి గుణదల, ముస్తాబాద రైల్వే స్టేషన్లు అనేవి సమీప రైల్వే స్టేషన్లు.
జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, షోఘి కాన్వెంట్, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, కెన్నడీ హైస్కూల్, రవీంద్ర భారతి స్కూల్, వికాస్ కాలేజ్ అఫ్ ఎడ్యుకేషన్ ( మెడిసిన్ తప్ప అన్ని రకాల విద్యా కోర్సులు అందిస్తుంది),
ఇది విజయవాడ రాబడి విభాగంలో విజయవాడ (గ్రామీణ) మండలం ప్రధాన కార్యాలయం.[1][4]
ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా, ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు.
నున్న గ్రామానికి శివారు గ్రామమైన బోడపాడు గ్రామంలో, శ్రీ భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం 2014,ఫిబ్రవరి-13,గురువారం నాడు, ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా స్వామివారికి అష్టోత్తర కలశాభిషేకం, పంచామృత కలశాభిషేకం, సహస్ర తులసీదళార్చన పూజలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మూడు వేల మందికి అన్నదానం చేశారు.
ఈ ఆలయం స్థానిక పంచాయతీ ఆఫీసు ప్రక్కన ఉంది.
నున్న గ్రామంలో వేంచేసియున్న శ్రీ పేరంటాళ్ళమ్మ తల్లి తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం చైత్రమాసంలో, ఐదు రోజులపాటు నిర్వహించెదరు. మొదటిరోజున ఉదయం 8 గంటలకు మానుపూజ, సాయంత్రం 5 గంటల నుండి మేళతాళాలతో దేవతామూర్తులైన వీరమ్మ, చింతయ్య, పార్వతమ్మ, గోపిరెడ్డి, నాగమ్మ, రామిరెడ్డి పేరంటాళ్ళను గ్రామ ప్రధాన వీధులలో ఊరేగించెదరు.రెండవ రోజున సాయంత్రం ఆరు గంటలకు భజన కార్యక్రమం, మూడవరోజున నంబళ్ళ యే అంకమ్మ తల్లి పురం ఏర్పాటు, నాల్గవరోజున అంకమ్మ తల్లి జీవిత చరిత్ర విశ్లేషణ, పూజాకార్యక్రమాలు, ఐదవ రోజున సిడిబండి ఊరేగింపు నిర్వహించెదరు. [6]
సాయి మందిరం, పిట్టల వీరస్వామి కుటుంబం స్థలప్రధానం చేయగా, గ్రామంలో వితరణశీలుల దానాలతో, సహాయంతో, అందమగా, అద్భుతంగా సాయి బాబా మందిరం నిర్మించారు అందమైన శిరిడి సాయి మందిరం, నిత్య పూజలతో శోభాయమానంగా ఉంటుంది
వరి, మొక్కజొన్న, చెఱుకు, పొగాకు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, మామిడి, జామ
కోలాటం పంతులుగా అందరికీ చిరపరిచితులైన శ్రీ కొండేటి కోటయ్య గారు ఈ గ్రామస్తులే. కోలాటం అంటే తెలియని ఆ రోజులలో, ఎంతోమంది విద్యార్థులకు ఈయన కోలాటం నేర్పినారు. విజయవాడ గ్రామీణ మండలంలోని గ్రామాలతోపాటు, చుట్టుప్రక్కల అనేక గ్రామాలలో గూడా "కోలాటం పంతులు"గా పేరు తెచ్చుకున్నారు. వీరు తన 77వ ఏట 29-11-2013న దివంగతులైనారు.[3]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12390. ఇందులో పురుషుల సంఖ్య 6304, స్త్రీల సంఖ్య 6086, గ్రామంలో నివాస గృహాలు 2883 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 4184 హెక్టారులు.
2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14,766. ఇందులో పురుషుల సంఖ్య 7328, స్త్రీల సంఖ్య 6848, గ్రామంలో నివాస గృహాలు 3917 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 4184 హెక్టారులు.
వరి, మామిడి, ముఖ్యమైన పంట.
నున్నలో ఉన్న మార్కెట్ యార్డు చాలా పెద్దది.