నువ్వొస్తానంటే నేనొద్దంటానా | |
---|---|
![]() | |
దర్శకత్వం | ప్రభు దేవా |
రచన | పరుచూరి సోదరులు, సందీప్ మలాని, ఎం. ఎస్. రాజు |
నిర్మాత | ఎం. ఎస్. రాజు |
తారాగణం | సిద్ధార్థ్, త్రిష కృష్ణన్, ప్రకాష్ రాజ్, వేద, శ్రీహరి |
ఛాయాగ్రహణం | వేణు గోపాల్ |
కూర్పు | కె. వి. కృష్ణా రెడ్డి |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
పంపిణీదార్లు | సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | జనవరి 14, 2005 |
సినిమా నిడివి | 165 ని. |
భాష | తెలుగు |
నువ్వొస్తానంటే నేనొద్దంటానా ప్రభుదేవా దర్శకత్వంలో 2005 లో విడుదలైన సినిమా. ఎం. ఎస్. రాజు నిర్మాణ సారథ్యంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో సిద్ధార్థ్, త్రిష ముఖ్య పాత్రలు పోషించారు. ప్రేమించిన అమ్మాయి కోసం ఒక ధనవంతుల కొడుకైన కథానాయకుడు వ్యవసాయం చేసి ఆమె అన్నయ్యను మెప్పించడం ఈ చిత్ర కథాంశం.[1] ఈ చిత్రం తొమ్మిది భాషల్లోకి పునర్నిర్మితం (రీమేక్) అయింది.[2]
శివరామకృష్ణ, అతని చెల్లెలు సిరి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతారు. శివరామకృష్ణ ఆ ఊరి స్టేషన్ మాస్టర్ సాయంతో అప్పులో ఉన్న పొలాన్ని దక్కించుకుని వ్యవసాయం చేసుకుంటూ చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇద్దరూ పెరిగి పెద్దవారవుతారు. సిరి చిన్నప్పటి నుంచి లలిత అనే స్నేహితురాలు ఉంటుంది.