![]() పంజాబ్ చిహ్నం ![]() పంజాబ్ ప్రభుత్వ పతాకం | |
ప్రభుత్వ స్థానం | చండీగఢ్ |
---|---|
చట్ట వ్యవస్థ | |
స్పీకరు | కుల్తార్ సింగ్ సంధ్వాన్[1] |
డిప్యూటీ స్పీకర్ | జై క్రిషన్ సింగ్ |
అసెంబ్లీలో సభ్యులు | 117 |
కార్యనిర్వహణ వ్యవస్థ | |
గవర్నరు | బన్వారిలాల్ పురోహిత్ |
ముఖ్యమంత్రి | భగవంత్ మాన్ |
ప్రధాన కార్యదర్శి | అనురాగ్ వర్మ, IAS[2] |
న్యాయవ్యవస్థ | |
హైకోర్టు | పంజాబ్, హర్యానా హైకోర్టు |
ప్రధాన న్యాయమూర్తి | గుర్మీత్ సింగ్ సంధవాలియా (తాత్కాలిక) |
పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం, లేదా స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం అని కూడా పిలువబడే పంజాబ్ ప్రభుత్వం, భారత రాష్ట్రమైన పంజాబ్ రాష్ట్ర 23 జిల్లాల అత్యున్నత పాలక అధికారసంస్థ. ఇందులో పంజాబ్ గవర్నరు నేతృత్వంలోని కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థ, శాసనశాఖ ఉంటాయి.
భారతదేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే, పంజాబ్ రాష్ట్ర అధిపతి గవర్నరును కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తారు. గవర్నరు పదవి ఎక్కువగా ఆచారబద్ధమైనది. ముఖ్యమంత్రి ప్రభుత్వానికి అధిపతి. చాలా వరకు కార్యనిర్వాహక అధికారాలు ముఖ్యమంత్రికే ఉంటాయి. పంజాబ్ రాజధాని చండీగఢ్. ఇక్కడ శాసనసభ, సచివాలయం ఉన్నాయి. చండీగఢ్ హర్యానా రాజధానిగా కూడా పనిచేస్తుంది. ఇది భారతదేశం లోని ఒక కేంద్రపాలిత ప్రాంతం. చండీగఢ్లో ఉన్న పంజాబ్ & హర్యానా హైకోర్టు మొత్తం రాష్ట్రంపై అధికార పరిధిని కలిగి ఉంది.[3]
ప్రస్తుత పంజాబ్ శాసనసభ ఏకసభ, ఇందులో 117 మంది శాసనసభ సభ్యులు (ఎంఎల్ఎ) ఉన్నారు.ఏదేని ఇతర పరిస్థితులలో ముందుగానే రద్దు చేయకపోతే దీని పదవీకాలం 5 సంవత్సరాలు.[4]
పోర్ట్ఫోలియో | మంత్రి | పదవి మొదలు | పదవి ముగింపు | పార్టీ | Ref | |
---|---|---|---|---|---|---|
| 16 మార్చి 2022 | అధికారంలో ఉన్నారు | AAP | [5] | ||
| 21 మార్చి 2022 | అధికారంలో ఉన్నారు | AAP | [6] | ||
| 5 జూలై 2022 | అధికారంలో ఉన్నారు | AAP | [7] | ||
| 21 మార్చి 2022 | అధికారంలో ఉన్నారు | AAP | |||
| 21 మార్చి 2022 | అధికారంలో ఉన్నారు | AAP | |||
| బల్బీర్ సింగ్ | 7 జనవరి 2023 | అధికారంలో ఉన్నారు | AAP | ||
| 21 మార్చి 2022 | అధికారంలో ఉన్నారు | AAP | |||
| 21 మార్చి 2022 | అధికారంలో ఉన్నారు | AAP | |||
| 21 మార్చి 2022 | అధికారంలో ఉన్నారు | AAP | |||
| హర్భజన్ సింగ్ ఇటో | 21 మార్చి 2022 | అధికారంలో ఉన్నారు | AAP | ||
| గుర్మీత్ సింగ్ ఖుడియన్ | 31 మే 2023 | అధికారంలో ఉన్నారు | AAP | ||
| 23 సెప్టెంబరు 2024 | అధికారంలో ఉన్నారు | AAP | |||
| 23 సెప్టెంబరు 2024 | అధికారంలో ఉన్నారు | AAP | |||
| 23 సెప్టెంబరు 2024 | అధికారంలో ఉన్నారు | AAP | |||
| 23 సెప్టెంబరు 2024 | అధికారంలో ఉన్నారు | AAP | |||
| 23 సెప్టెంబరు 2024 | అధికారంలో ఉన్నారు | AAP |
శాసనసభ గవర్నరు, పంజాబ్ శాసనసభ ఉంటాయి. ఇది రాష్ట్రంలోని అత్యున్నత రాజకీయ సంస్థ. శాసనసభను పిలిపించే లేదా మూసివేసే అధికారం గవర్నరుకు ఉంటుంది. శాసనసభ సభ్యులందరును సాధారణంగా ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికలలో 18 ఏళ్లు పైబడిన అర్హులైన ఓటర్ల ఎన్నుకుంటారు. ప్రస్తుత శాసనసభలో 117 మంది ఎన్నికైన సభ్యులు ఉన్నారు. ఎన్నికైన సభ్యులు తమ సొంత సభ్యులలో ఒకరిని దాని ఛైర్పర్సన్గా ఎన్నుకుంటారు. ఇతనిని శాసనసభ స్పీకరు అని పిలుస్తారు. స్పీకరుకు డిప్యూటీ స్పీకరు సహాయకారిగా ఉంటారు. అతనిని కూడా శాసనసభ్యుల ఎన్నుకుంటారు. సభలో సమావేశాన్ని నిర్వహించడం స్పీకరు బాధ్యత. స్పీకరు గైరు హాజరు అయిన సందర్బలో డిప్యూటీ స్పీకరు ఆ బాధ్యతను నిర్వహిస్తాడు
పంజాబ్, హర్యానా హైకోర్టు భారతదేశంలోని పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు, భారతదేశ కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్కు ఉమ్మడి హైకోర్టు. దీనిలో 64 మంది శాశ్వత న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తితో సహా 21 మంది అదనపు న్యాయమూర్తులతో కూడిన ఈ హైకోర్టు న్యాయమూర్తుల మంజూరు చేయబడిన బలం 85. 2023 సెప్టెంబరు 14 నాటికి, 36 మంది శాశ్వత, 22 అదనపు న్యాయమూర్తులతో కూడిన 58 మంది న్యాయమూర్తులు హైకోర్టులో పనిచేస్తున్నారు.[8]