బి.సి. గౌరీశంకర్ | |
---|---|
జననం | |
మరణం | 2004 నవంబరు 16 | (వయసు 54)
వృత్తి | సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1977–2004 |
జీవిత భాగస్వామి | మమతా రావు |
పిల్లలు | రక్షిత |
బి.సి. గౌరీశంకర్ (1950, ఫిబ్రవరి 25 - 2004, నవంబరు 16) కర్ణాటక రాష్ట్రానికి చెందిన సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. ప్రధానంగా కన్నడ సినిమాలకు పనిచేశాడు. సినిమాటోగ్రాఫర్గా తన అసాధారణ శైలికి ప్రసిద్ది చెందాడు.[1] గౌరీశంకర్ సినిమాటోగ్రాఫర్గా తన కెరీర్లో ఆరు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నాడు.[2] 1988లో అంబరీష్, గౌతమి, రమేష్ అరవింద్ తదితరులతో ఏలు సుట్టిన కోట సినిమా తీసి మంచి విజయాన్ని సాధించాడు.
గౌరీశంకర్ 1950 ఫిబ్రవరి 26న బి. చన్నబసప్ప - శశిముఖి దంపతులకు కర్ణాటకలోని బెంగళూరులో జన్మించాడు. జయచామరాజేంద్ర పాలిటెక్నిక్ నుండి సినిమాటోగ్రఫీలో డిప్లొమా పొందాడు. బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్లో కొంతకాలం పనిచేశాడు.
హోస బెలకు, ప్రాయ ప్రాయ ప్రాయ, అంతరాల వంటి సినిమాల్లో నటించిన కన్నడ నటి మమతా రావుతో గౌరీశంకర్ వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె రక్షిత (సినిమా నటి) ఉంది.
1977లో అనురూప అనే కన్నడ సినిమాతో సినిమాటోగ్రాఫర్గా పరిచయమయ్యాడు. ఆ తరువాత స్పందన (1978), అరివు (1979) వంటి 1970ల సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా విమర్శకుల ప్రశంసలను పొందాడు.[2]
1995 విమర్శకుల ప్రశంసలు పొందిన మాఫియా చిత్రం ఓం (1995)లో, అండర్ వరల్డ్ మానసిక స్థితిని చూపించడానికి ఫిల్టర్లను ఉపయోగించాడు. పుష్పక విమానం (1987), ముంగరిన మించు (1998) సినిమాలకు పనిచేసి ప్రశంసించబడ్డాడు. 1996లో వచ్చిన జనుమద జోడి సినిమాలో సూర్యాస్తమయం కొన్ని నిమిషాలపాటు మాత్రమే ఉండేలా తొమ్మిది రోజులపాటు సూర్యాస్తమయం నేపథ్యంలో శివరాజ్కుమార్, శిల్పా, పవిత్రా లోకేష్లపై "మణి మణిగొండు దారా" పాటను చిత్రీకరించాడు. మైసూర్ మల్లిగే (1992) సినిమాలోని "దీపావు నిన్నే గాలియు నిన్నడే" పాటను ఒక చిన్న దీపం వెలుగులో సుధారాణిపై చిత్రీకరించాడు. ఈ సినిమాకు ఇతడికి ఐదవ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం లభించింది.
ఇతడు 2004, నవంబరు 16న కర్ణాటకలోని బెంగళూరులో మరణించాడు.