సర్ బెనెగళ్ రామారావు | |
---|---|
4వ భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నరు | |
In office 1949 జూలై 1 – 1957 జనవరి 14 | |
అంతకు ముందు వారు | సి.డి.దేశ్ముఖ్ |
తరువాత వారు | కె.జి.అంబేగాంకర్ |
అమెరికాలో భారత రాయబారి | |
In office 1948–1949 | |
జాపానులో భారత రాయబారి | |
In office 1947–1948 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1889 జూలై 1 |
మరణం | 1969 డిసెంబరు 13 | (వయసు 80)
కళాశాల | కేంబ్రిడ్జి కింగ్స్ కాలేజీ |
వృత్తి | Civil servant |
సంతకం |
సర్ బెనెగళ్ రామారావు CIE, ICS (1889 జూలై 1 - 1969 డిసెంబరు 13 [1] [2] ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాల్గవ గవర్నరు. [3] 1949 జూలై 1 నుండి 1957 జనవరి 14 వరకు అతని ఈ పదవిలో పనిచేసాడు.
మంగళూరుకు చెందిన చిత్రపూర్ సారస్వత్ బ్రాహ్మణ [4] కుటుంబంలో రామారావు జన్మించాడు. అతని మాతృభాష కొంకణి. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ లోను, కేంబ్రిడ్జ్ లోని కింగ్స్ కాలేజీ లోనూ చదువుకున్నాడు.
అతని అన్నయ్య సర్ బెనెగళ్ నర్సింగ్ రావు భారత ప్రభుత్వ అధికారి, న్యాయనిపుణుడు, దౌత్యవేత్త. అతను భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన రాజనీతిజ్ఞుడు. రామారావు తమ్ముడు బి.శివరావు జర్నలిస్టు, రాజకీయవేత్త. కాశ్మీరీ బ్రాహ్మణ సంతతికి చెందిన ధన్వంతిని రామారావు పెళ్ళి చేసుకున్నాడు. భారతీయ మహిళా హక్కుల ఉద్యమంలో నాయకురాలు. ప్రణాళికాబద్ధమైన పేరెంట్హుడ్కు అంతర్జాతీయ అధ్యక్షురాలు. వారి చిన్న కుమార్తె శాంతా రామారావు ట్రావెల్ రైటరు, పెళ్ళి చేసుకుని అమెరికాలో స్థిరపడింది.
1919లో ఇండియన్ సివిల్ సర్వీస్లో చేరాడు. 1930లో కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ (CIE) గా నియమితుడయ్యాడు. [5] 1939లో నైట్ హోదా పొందాడు. [6] ఆర్బిఐ గవర్నరుగా ఎక్కువ కాలం పనిచేసాడు. ఆర్థిక మంత్రి టిటి కృష్ణమాచారితో విభేదాల కారణంగా, రెండవసారి పొడిగించిన పదవీకాలం ముగిసే లోపే రాజీనామా చేసాడు. [3] రామారావు క్రింది పదవులను నిర్వహించాడు. [7]
భారతదేశానికి తిరిగి వచ్చాక అతను బాంబే పోర్ట్ ట్రస్ట్ (1941-1946) ఛైర్మన్గా నియమితుడయ్యాడు. ఆ తర్వాత అతను జపాన్లో భారత రాయబారి గాను (1947-1948), యునైటెడ్ స్టేట్స్లో రాయబారి గానూ (1948-1949) పనిచేశాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు ఆయన నిర్వహించిన చివరి పదవి. ఇప్పటి వరకు అత్యధిక కాలం ఆర్బీఐ గవర్నర్గా సేవలందించిన వ్యక్తి అతనే. [8]