భగవద్గీత | |
---|---|
దర్శకత్వం | జి.వి.అయ్యర్ |
రచన | బన్నంజే గోవిందచార్య జివి అయ్యర్ |
దీనిపై ఆధారితం | భగవద్గీత |
నిర్మాత | టి. సుబ్బరామి రెడ్డి |
తారాగణం | నీనా గుప్తా గోపి మనోహర్ జి. వి. రాఘవేంద్ర |
ఛాయాగ్రహణం | మధు అంబట్ |
కూర్పు | శ్రీ నంజుందస్వామి |
సంగీతం | మంగళంపల్లి బాలమురళీకృష్ణ |
విడుదల తేదీ | 1993 సెప్టెంబరు 17 |
సినిమా నిడివి | 140 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | సంస్కృతం |
భగవద్గీత, 1993 సెప్టెంబరు 17న విడుదలైన సంస్కృత సినిమా.[1] టి. సుబ్బరామి రెడ్డి నిర్మాణంలో జి.వి.అయ్యర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భగవద్గీత పుస్తకం ఆధారంగా రూపొందించబడింది.[2] ఇందులో నీనా గుప్తా, గోపి మనోహర్, జి. వి. రాఘవేంద్ర తదితరులు నటించారు.
పూలతో శివలింగం పూజించే సన్నివేశంతో సినిమా ప్రారంభమవుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు, తన రథసారథి శ్రీ కృష్ణుడు ఉన్నారు. ఇద్దరి మధ్య సంభాషణలతో భగవద్గీత ప్రారంభమవుతంది. అందులోని శ్లోకాలతో కాంప్లిమెంటరీ ఇమేజరీ, ప్రకృతిలో ఉన్న అనేక దృశ్యాలు చూపబడుతాయి. చివరికి అర్జునుడు హిమాలయాల మధ్య మేఘాలపైన నిలబడి, కృష్ణుడు పాడిన పద్యాలతోపాటు గ్రహాలు దాటి విశ్వంలోకి మరింతగా పెరుగుతాడు.
హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా ప్రదర్శన జరిగింది.[3] 1993లో జరిగిన 40వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.[4][5][6]
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)