జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా | |
---|---|
దస్త్రం:Geological Survey of India Logo.png | |
కేంద్ర కార్యాలయం - జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా - ఇండియన్ మ్యూజియం ఆవరణ - 27 జె ఎన్ రోడ్ కోల్కతా. | |
సంస్థ అవలోకనం | |
స్థాపనం | 1851 |
అధికార పరిధి | British India (1851-1947) Republic of India (From 1947) |
ప్రధాన కార్యాలయం | Kolkata |
ఏజెన్సీ కార్యనిర్వాహకుడు/ | మొండ్రేటి శ్రీధర్, C.G.S., ADG (G) Director General Additional Charge |
మాతృ శాఖ | గనుల మంత్రిత్వ శాఖ |
వెబ్సైటు | |
https://www.gsi.gov.in/ |
భారతదేశంలో భూగర్భాన్ని భూమి పొరలనూ సర్వే చేసేందుకు నెలకొల్పిన సంస్థ, భారతీయ భూగర్భ సర్వే (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా -జిఎస్ఐ). 1851 లో స్థాపించబడిన ఈ సంస్థ, ప్రపంచంలోని అత్యంత పురాతన సంస్థలలో ఒకటి. సర్వే ఆఫ్ ఇండియా (1767 లో స్థాపించబడింది) తరువాత, భారతదేశంలో రెండవ పురాతన సర్వే సంస్థ. ఇది భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది. సంస్థ భారతదేశపు జియొలాజికల్ సర్వేలు, అధ్యయనాలను చెయ్యడంతో పాటు, ప్రభుత్వం, పరిశ్రమలు, సాధారణ ప్రజలకూ అవసరమైన ప్రాథమిక భూగర్భ విజ్ఞాన సమాచారాన్ని ఇది అందిస్తుంది. అలాగే ఉక్కు, బొగ్గు, లోహాలు, సిమెంట్, విద్యుత్ పరిశ్రమల వేదికల లోను, అంతర్జాతీయ భూగర్భ శాస్త్రీయ వేదికల లోనూ అధికారికంగా పాల్గొంటుంది.
GSI (జియాలజీ), ఏఎస్ఐ (ఆర్కియాలజీ), BSI (వృక్షశాస్త్రం), FiSI (మత్స్య), FSI (అడవులు), IIEE (ఎకాలజీ), nIO (ఓషనోగ్రఫీ), RGCCI (జనాభా సర్వే), లాంగ్వేజ్ సర్వే), SI (కార్టోగ్రఫీ), ZSI (జువాలజీ) లు భారతదేశంలోని ముఖ్య జాతీయ సర్వే సంస్థలు.
వనరులను క్రమబద్ధంగా దోచుకుని,[1] భారతదేశంలో పరిశ్రమలు లేకుండా చేసి, బ్రిటన్లో పారిశ్రామిక విప్లవానికి దోహదపడి,[2][3][4] భారతదేశాన్ని బ్రిటిష్ తయారీదారులకు ముడి సరుకుల సరఫరాదారుగా మార్చి, బ్రిటన్లో తయారైన వస్తువులకు భారత్ను పెద్ద మార్కెట్గా మార్చే ఉద్దేశాలతో బ్రిటిష్ వారు భారత్ను వలసరాజ్యంగా మార్చుకున్నరు.[5] 1851 లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించిన జిఎస్ఐకి మూలాలు 1836 లో ఉన్నాయి. అప్పుడు కంపెనీ వారు "బొగ్గు కమిటీ" వంటి మరిన్ని కమిటీలను ఏర్పరచి, భారతదేశపు తూర్పు ప్రాంతాలలో బొగ్గు లభ్యతను అధ్యయనం చేయడానికీ, అన్వేషించడానికీ ప్రయత్నాలు చేసారు. బ్రిటిష్ జియోలాజికల్ సర్వేకు మొదటి సర్వేయర్లలో ఒకరైన డేవిడ్ హిరామ్ విలియమ్స్ను 1845 డిసెంబరు 3 న 'బొగ్గు జిల్లాల సర్వేయర్, బొగ్గు పనుల సూపరింటెండెంట్' గా నియమించారు. తరువాతి ఫిబ్రవరిలో అతడు భారతదేశానికి వచ్చాడు. 1847 డిసెంబరు నాటి దామూదా, అడ్జి గ్రేట్ బొగ్గు క్షేత్రపు మ్యాపును, దాని [6] అడ్డుకోత [7][8], నిలువుకోతల మ్యాపులతో కలిపి తయారు చేసి, దానికి "జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా" అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడాడు.[9] 1848 ఫిబ్రవరి 4 న, అతన్ని "జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క జియోలాజికల్ సర్వేయర్"గా నియమించారు. కాని అతను తన ఏనుగు మీద నుండి పడిపోయాడు. తరువాత కొన్నాళ్ళకే, అతని సహాయకుడు ఎఫ్బి జోన్స్ తో సహా 'జంగిల్ ఫీవర్' తో 1848 నవంబరు 15 న మరణించాడు.[10] తరువాత 1851 మార్చి 5 న పదవీ విరమణ చేసే వరకు జాన్ మెక్క్లెల్లాండ్ "ఆఫీషియేటింగ్ సర్వేయర్"గా బాధ్యతలు నిర్వర్తించాడు.[11][12]
1852 వరకు, జియోలాజికల్ సర్వే ప్రధానంగా బొగ్గు అన్వేషణ (ప్రధానంగా ఆవిరి యంత్రాల కోసం), చమురు నిల్వలు, ఖనిజ నిక్షేపాల అంవేషణ పైనే దృష్టి పెట్టింది. రిచర్డ్ డిక్సన్ ఓల్డ్హామ్ (సర్ థామస్ ఓల్డ్హాం తండ్రి) జియోలాజికల్ సర్వే పరిధిని విస్తృతం చేసాడు. భారతదేశపు భూగర్భాన్ని ముందు మ్యాపింగ్ చేయకుండా బొగ్గును కనుగొనడం సాధ్యం కాదని ప్రభుత్వం వద్ద అతడు వాదించాడు. ఆ విధంగా, జియోలాజికల్ సర్వే వివిధ రకాలైన శిలల రకాలను, భౌగోళిక నిర్మాణాలను, సాపేక్ష వయస్సులనూ మ్యాప్ చేయడం మొదలుపెట్టింది. ఇండెక్స్ శిలాజాల ఉనికిని బట్టి రాతిపొరల వయస్సును అంచనా వేసేవారు. ఈ ఇండెక్సు శిలాజాలను కనుగొనడంలోనే భూవిజ్ఞాన శాస్త్రవేత్తల కృషీ సమయమూ ఖర్చైపోయేది. ఎందుకంటే రాతిపొరల వయస్సును అంచనా వేయడానికి ఆ రోజుల్లో రేడియోమెట్రిక్ డేటింగ్ పద్ధతి ఇంకా అభివృద్ధి చేయలేదు.[11][12] రాంగడ్ బిలాన్ని మొదటగా 1869 లో ఫ్రెడరిక్ రిచర్డ్ మేలట్ సందర్శించాడు.[13][14] తరువాతి అధ్యయనాలలో ఆర్థర్ లెనాక్స్ కొల్సన్ చేసినవి ఉన్నాయి
19 వ శతాబ్దంలో GSI, గ్రేట్ ట్రిగనామెట్రికల్ సర్వే, 1869 కైలాష్ - మానసరోవర్ యాత్ర, 1871-1872 షిగాచే - లాసా యాత్ర, 1873-1874 యార్కండ్ - కష్గర్ యాత్ర, ఇదే ప్రాంతంలో సర్ థామస్ డగ్లస్ ఫోర్సిత్ చేసిన రెండవ యాత్ర, 1878-1882 డార్జిలింగ్ - లాసా - మంగోలియా యాత్ర మొదలైన వాటితో సహా అనేక సర్వేలు చేసింది.[15][16][17][18] స్థానిక సర్వేయర్లను పండిట్ అని పిలిచేవారు. వీరిలో నైన్ సింగ్ రావత్, కృష్ణ సింగ్ రావత్ కజిన్ సోదరులూ ఉన్నారు .[19]
19 వ శతాబ్దిలోను, 20 వ శతాబ్దం ప్రారంభంలోనూ జిఎస్ఐ అనేక భారతీయ భూకంపాలపై అధ్యయనాలు చేసి, వివరణాత్మక నివేదికలు వెలువరించి సీస్మాలజీకి ముఖ్యమైన తోడ్పాటు నందించింది. రిచర్డ్ డిక్సన్ ఓల్డ్హామ్ (అతని తండ్రి కూడా GSI కోసం పనిచేశారు) మొదట p- s- తరంగాలను సరిగ్గా గుర్తించాడు. భూమి కోర్ యొక్క వ్యాసాన్ని ఊహించి లెక్కించాడు.[11][12]
2017 ఏప్రిల్ 8 న, ప్రత్యేకంగా అమర్చిన విమానాలను ఉపయోగించి మొట్టమొదటి వైమానిక సర్వేను మిదలుపెట్టింది. 20 కి.మీ. లోతు వరకు ఖనిజ నిల్వలను మ్యాప్ చేయడానికి ఇది పైలట్ ప్రాజెక్టు.[20]
ఎస్.విజయ్ కుమార్ అధ్యక్షతన ఉన్న ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఆధారంగా, జిఎస్ఐని "బేస్లైన్ సర్వేలు"; "మినరల్ రిసోర్స్ అసెస్మెంట్స్"; "జియోఇన్ఫర్మేటిక్స్"; "మల్టీ-డిసిప్లినరీ జియోసైన్సెస్", "శిక్షణ, సామర్థ్యాల పెంపు"కు సంబంధించి 5 మిషన్లుగా పునర్వ్యవస్థీకరించారు.[21]
సీనియర్ నం. | పేరు | కాలం | దేశం |
---|---|---|---|
1. | డాక్టర్ థామస్ ఓల్డ్హామ్, సూపరింటెండెంట్ | 1851-1876 | డబ్లిన్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ |
2. | హెచ్ బి మెడ్లికాట్, సూపరింటెండెంట్ | 1876-1885 | లోగ్రియా, కౌంటీ గాల్వే, ఐర్లాండ్ |
3. | హెచ్బి మెడ్లికాట్, డైరెక్టర్ | 1885-1887 | లోగ్రియా, కౌంటీ గాల్వే, ఐర్లాండ్ |
4. | విలియం కింగ్ జూనియర్. | 1887-1894 | ఐర్లాండ్ ; ఒక ఆంగ్లో-ఐరిష్ |
5. | సి ఎల్ గ్రీస్బాచ్ | 1894-1903 | వియన్నా, ఆస్ట్రియా |
6. | సర్ టిహెచ్ హాలండ్ | 1903-1910 | హెల్స్టన్, కార్న్వాల్, ఇంగ్లాండ్ |
7. | సర్ హెన్రీ. హెచ్. హేడెన్ | 1910-1921 | డెర్రీ, ఐర్లాండ్ |
8. | సర్ ఎడ్విన్ హాల్ పాస్కో | 1921-1932 | ఇంగ్లాండ్ |
9. | సర్ ఎల్ ఎల్ ఫెర్మోర్ | 1932-1935 | పెక్కం, దక్షిణ లండన్, ఇంగ్లాండ్ |
10. | డాక్టర్ ఎఎమ్ హెరాన్ | 1935-1939 | బ్రిటిష్, డడ్డింగ్స్టన్, ఎడిన్బర్గ్, స్కాట్లాండ్ |
11. | డాక్టర్ సిరిల్ ఎస్ ఫాక్స్ | 1939-1943 | - |
12. | డాక్టర్ ఎడ్వర్డ్ లెస్లీ గిల్బర్ట్ క్లెగ్గ్ | 1943-1944 | మాంచెస్టర్, ఇంగ్లాండ్ |
13. | హెచ్. క్రూక్శాంక్ | 1944-1945 | - |
14. | JA డన్ | 1945 | - |
15. | డాక్టర్ విలియం డిక్సన్ వెస్ట్ | 1945-1951 | బౌర్న్మౌత్, ఇంగ్లాండ్ |
16. | డాక్టర్ ఎం.ఎస్.కృష్ణన్, మొదటి భారత డైరెక్టర్ | 1951-1955 | తంజావూరు, తమిళనాడు |
17. | వి.పి.సోంధి | 1955-1958 | - |
18. | డాక్టర్ బిసి రాయ్ | 1958-1964 | - |
క్ర. సం | పేరు | కాలం | శాఖ |
---|---|---|---|
1. | డా. బి సి రాయ్ | 1964–1965 | జియాలజీ |
2. | అర్ ఎ జి జింగ్రాన్ | 1965–1966 | జియాలజీ |
3. | జి సి చటర్జీ | 1966–1969 | జియాలజీ |
4. | ఎం ఎస్ బాలసుందరం | 1969–1972 | జియాలజీ |
5. | డా. ఎం. కె రాయ్ చౌధురి | 1972–1974 | జియాలజీ |
6. | సి కరుణాకరన్ | 1974–1975 | జియాలజీ |
7. | డా. వి కె ఎస్ వర్దన్ | 1976–1977 | జియాలజీ |
8. | వి ఎస్ కృష్ణస్వామి | 1978–1981 | జియాలజీ |
9. | జె స్వామి నాథ్ | 1981–1982 | జియాలజీ |
10. | ఎస్ కె ముఖర్జీ | 1982–1986 | జియాలజీ |
11. | డి పి ధౌండియల్ | 1986–1990 | జియాలజీ |
12. | డా డి కె రాయ్ | 1990–1991 | జియాలజీ |
13. | సి పి వోహ్రా | 1991–1992 | జియాలజీ |
14. | ఎస్ ఎన్ చతుర్వేది | 1992–1993 | జియాలజీ |
15. | డి బి డిమ్రీ | 1993–1996 | జియాలజీ |
16. | డా ఎస్ కె ఆచార్య | 1996–2000 | జియాలజీ |
17. | కె కృష్ణన్ ఉన్ని | 2000–2001 | జియాలజీ |
18. | రవి శంకర్ (యాక్టింగ్) | 01.04.2001–30.11.2001 | జియాలజీ |
19. | పి సి మొండల్ | 2001–2004 | కెమిస్ట్రీ |
20. | డా కె ఎన్ మాథుర్ | 2004–2005 | కెమిస్ట్రీ |
21. | డా ఎం కె ముఖోపాధ్యాయ (యాక్టింగ్) | 01.10.2005–31.12.2005 | జియాలజీ |
22. | డా ఎస్ ఎన్ పాండే (యాక్టింగ్) | 2006–2009 | జియాలజీ |
23. | డా ఎన్ కె దత్తా (యాక్టింగ్) | 2009–2010 | జియాలజీ |
24. | 2010–2011 | Engineering | |
25. | ఎ సుందర మూర్తి | 2011–2013 | జియాలజీ |
26. | శిశిర్ చంద్ర రథ్ (యాక్టింగ్) | 01.11.2013–31.12.2013 | జియాలజీ |
27. | డా సుదేష్ కుమార్ వాధ్వాన్ (యాక్టింగ్) | 01.01.2014–31.07.2014 | జియాలజీ |
28. | హర్బన్స్ సింగ్ | 31.07.2014–30.05.2016 | జియాలజీ |
29. | ఎం రాజు (యాక్టింగ్) | 01.06.2016–30.08.2017 | జియాలజీ |
30. | ఎం రాజు | 30.08.2017–31.08.2017 | జియాలజీ |
31. | ఎన్. కుటుంబరావు | 01.09.2017–31.05.2018 | జియాలజీ |
32. | డా. దినేష్ గుప్తా (యాక్టింగ్) | 01.06.2018–31.03.2019 | Geophysics |
33. | బిపుల్ పాఠక్ (యాక్టింగ్) | 01.04.2019–17.09.2019 | IAS, Joint Secretary, Ministry of Mines, GoI |
33. | ఎస్. ఎన్ మేష్రాం (యాక్టింగ్) | 18.09.2019–27.01.2020 | జియాలజీ |
33. | మొండ్రేటి శ్రీధర్ (యాక్టింగ్) | 28.01.2020–Till date | జియాలజీ |
జిఎస్ఐ కొన్ని జియొలాజికల్ పార్కులను అభివృద్ధి చేసింది. 247 ఎకరాలలో విస్తరించి, వృక్ష శిలాజాలతో తొమ్మిది వేర్వేరు ఎన్క్లేవ్లు ఉన్న తిరువక్కరై నేషనల్ ఫాసిల్ వుడ్ పార్కు, 12 కోట్ల సంవత్సరాల నాటి, క్రెటేషియస్ కాలపు, 18 మీటర్ల వృక్ష శిలాజం ఉన్న సాతనూరు నేషనల్ ఫాసిల్ వుడ్ పార్క్, అసలు పరిమాణంలో ఉన్న T- రెక్స్,ఇతర డైనోసార్ల బొమ్మలున్న నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్, చండీగఢ్ సమీపంలో, ఆరు చరిత్ర-పూర్వ జంతువుల అసలు పరిమాణపు ఫైబర్గ్లాస్ నమూనాలతో ఉన్న సాకేటి శిలాజ పార్కు శిలాజ మ్యూజియాలు వీటిలో కొన్ని.