మీనాక్షి జైన్ | |
---|---|
విద్యాసంస్థ | ఢిల్లీ విశ్వవిద్యాలయం |
వృత్తి | చరిత్రకారులు, రాజకీయ శాస్త్రవేత్త |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారతీయ చరిత్ర గురించి పుస్తకాలు రచించడం |
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం |
మీనాక్షి జైన్ ఒక భారతీయ రాజకీయ శాస్త్రవేత్త, చరిత్రకారులు. కుల, రాజకీయాల మధ్య సంబంధాలపై పండితురాలు. ఆమె ప్రస్తుతం ఢిల్లీలోని గార్గి కళాశాలలో చరిత్ర అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉన్నారు. 2014లో భారత ప్రభుత్వం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ లో సభ్యురాలిగా నామినేట్ చేసింది. ఆమె సాహిత్యం , విద్యా రంగంలో చేసిన కృషికి గాను 2020లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ పురస్కారం పొందింది. [1]
మీనాక్షి జైన్ ది టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ సంపాదకుడు జర్నలిస్ట్ గిరిలాల్ జైన్ కుమార్తె. [2] ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో పి.హెచ్.డి పొందింది. [3] సామాజిక పునాది, కుల, రాజకీయాల మధ్య సంబంధాలపై ఆమె చేసిన థీసిస్ 1991లో ప్రచురించబడింది. [3]
జైన్ ఢిల్లీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న గార్గి కళాశాలలో చరిత్ర అసోసియేట్ ప్రొఫెసర్. ఆమె 2014 డిసెంబరులో భారత ప్రభుత్వం చే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సభ్యురాలిగా నామినేట్ చేయబడింది.
{{cite web}}
: |first4=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)