మీర్ లాయక్ అలీ | |
---|---|
![]() 1948 ఆపరేషన్ పోలో సమయంలో మీర్ లాయక్ అలీ | |
హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రి | |
In office 29 నవంబరు 1947 – 19 సెప్టెంబరు 1948 | |
అంతకు ముందు వారు | నవాబ్ మెహదీ యార్ జంగ్ |
తరువాత వారు | పదవి రద్దు |
హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రి | |
అంతకు ముందు వారు | నవాబ్ మెహదీ యార్ జంగ్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1903 |
మరణం | 24 అక్టోబరు 1971 |
మీర్ లాయక్ అలీ (1903 - 1971 అక్టోబరు 24) నిజాంల పాలనలోని హైదరాబాద్ రాష్ట్ర చివరి ప్రధానమంత్రి.[1] ఇతనికి అధికారికంగా "హైదరాబాద్ నిజాం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రెసిడెంట్" బిరుదు ఉంది.
లాయక్ అలీ 1903లో జన్మించాడు.[2]
మీర్ లాయక్ అలీ ఇంజనీర్, పారిశ్రామికవేత్త. 1947 నవంబరు నుండి 1948 సెప్టెంబరులో ఆపరేషన్ పోలో "పోలీసు చర్య" వరకు హైదరాబాద్ రాష్ట్రానికి ప్రధాన మంత్రిగా పనిచేశాడు.[3] తన హయాంలో హైదరాబాద్ స్వతంత్ర దేశంగా నిలదొక్కుకోవడానికి పోరాడాడు.[4] హైదరాబాదీ రక్షణ దళాలు ఓడిపోయి, హైదరాబాద్ భారత యూనియన్లో విలీనం చేసిన తరువాత, లాయక్ ను బేగంపేటలోని తన ఇంటిలో గృహ నిర్బంధంలో ఉంచారు. 1950 మార్చిలో పాకిస్తాన్ వెళ్ళి, అక్కడి ప్రభుత్వంలో పనిచేశాడు.
లాయక్ అలీ పాకిస్తాన్ తరపున అధికారిక నియామకంలో ఉన్న సమయంలోనే 1971, అక్టోబరు 24న న్యూయార్క్లో మరణించాడు. సౌదీ అరేబియాలోని పవిత్ర నగరమైన మదీనాలో అంత్యక్రియలు జరిగాయి.
మీర్ లాయక్ అలీ తన అనుభవాలతో ట్రాజెడి ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకాన్ని రాశాడు.[5] ఈ పుస్తకాన్ని హైద్రాబాద్ విషాదం పేరుతో ఏనుగు నరసింహారెడ్డి తెలుగులోకి అనువదించాడు.
అంతకు ముందువారు నవాబ్ మెహదీ యార్ జంగ్ |
హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రి 1947 - 1948 |
తరువాత వారు పదవి రద్దు |