యద్దనపూడి సులోచనారాణి | |
---|---|
జననం | 1940 కాజ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
మరణం | మే 18, 2018[1] కుపర్టినో, కాలిఫోర్నియా, అమెరికా |
వృత్తి | నవలా రచయిత్రి |
జాతీయత | భారతీయురాలు |
కాల వ్యవధి | 1970–2018 |
సాహిత్య ప్రక్రియ | శృంగారం, నాటకం, నవల |
యద్దనపూడి సులోచనారాణి తెలుగు రచయిత్రి. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన ఆమె రచనలు అనేకం. ఈమె కథలు పలు సినిమాలుగా మలచబడ్డాయి. సులోచనారాణి 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని కాజ గ్రామములో జన్మించింది.
ఈమె రచనలు కేవలం సినిమాలుగానే కాక అనేక టీ.వీ. ధారావాహికలుగా రూపొందించబడ్డాయి.
ఈమె 1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు. ఈమె సుమారు 40 నవలల వరకూ రచించారు.
|
|
అమెరికా కాలిఫోర్నియాలోని కుపర్టినోలో 2018, మే 18న గుండెపోటుతో మృతిచెందారు.[3]