రసిక జోషి | |
---|---|
జననం | |
మరణం | 2011 జూలై 7 | (వయసు 38)
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2004–2011 (చనిపోయే వరకు) |
రసిక జోషి (1972 సెప్టెంబరు 12 - 2011 జూలై 7) ) మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టెలివిజన్, సినిమా నటి. హిందీ, మరాఠీ సినిమాలలో నటించింది.[1]
రసిక, 1972 సెప్టెంబరు 12న మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.
దర్శకుడు, నటుడు గిరీష్ జోషితో రసిక జోషి వివాహం జరిగింది.[2]
అవినాష్ మసురేకర్, స్మితా తల్వాల్కర్ నటించిన ఉంచ మజా జోకా అనే లతా నర్వేకర్ మరాఠీ నాటకంతో తన నటనావృత్తిని ప్రారంభించింది. రామ్ గోపాల్ వర్మ తీసిన నాట్ ఎ లవ్ స్టోరీ సినిమాలో చివరిసారిగా నటించింది. వైట్ లిల్లీ అండ్ నైట్ రైడర్ నాటకానికి రచయితగా, దర్శకుడిగా, నటుడిగా పనిచేసింది.[3]
ఘడ్లే బిఘడ్లే, బువా అలా, యే దునియా హై రంగీన్ మొదలైన వాటిలో నటించింది. బందినిలో తరులతగా ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి.
రసిక జోషి చాలా సినిమాలు, నాటకాలు, టెలివిజన్ సీరియల్స్లో నటించిన ప్రతిభావంతులైన నటి. యండ కర్తవ్య ఆహే అనే మరాఠీ సినిమాకు రచయితగా పనిచేసింది. స్వయంగా రచించిన, దర్శకత్వం వహించిన వైట్ లిల్లీ & నైట్ రైడర్ అనే నాటకం అనేక అవార్డులు, ప్రశంసలు, ప్రశంసలను గెలుచుకుంది.
రసిక, 38 ఏళ్ల వయస్సులో 2011 జూలై 7న లుకేమియా వ్యాధితో ముంబైలోని ఒక నర్సింగ్హోమ్లో మరణించింది.[4][5]