రాము కారియత్ | |
---|---|
జననం | ఎంగండియూర్, త్రిస్సూరు జిల్లా, కేరళ, భారతదేశం | 1927 ఫిబ్రవరి 1
మరణం | 1979 ఫిబ్రవరి 10 త్రివేండ్రం, కేరళ, భారతదేశం | (వయసు 52)
వృత్తి | సినిమా దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1954–1979 |
గుర్తించదగిన సేవలు | చెమ్మీన్, నీలక్కుయిల్ |
బంధువులు | దేవన్ |
రాము కారియత్, (1 ఫిబ్రవరి 1927 - 10 ఫిబ్రవరి 1979) మలయాళ సినిమా దర్శకుడు. 1950 నుండి 1980 వరకు దాదాపు మూడు దశాబ్దాలుగా మలయాళ సినిమారంగంలో దర్శకుడిగా వెలగొందుతూ నీలక్కుయిల్ (1954), మిన్నమినింగు (1957), ముడియనయ పుత్రన్ (1961), మూడూపదం (1963), చెమ్మీన్ (1965) వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. చెమ్మీన్ సినిమా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో జాతీయ ఉత్తమ సినిమా అవార్డును అందుకుంది. దక్షిణ భారతదేశం నుండి ఉత్తమ చలనచిత్రంగా ఎన్నికైన తొలి సినిమా ఇది.[1]
ఇతడు 1927, ఫిబ్రవరి 1న కేరళ రాష్ట్రం, త్రిస్సూరు జిల్లాలోని ఎంగండియూర్ గ్రామంలో జన్మించాడు.
1979, ఫిబ్రవరి 10న త్రివేండ్రంలో మరణించాడు.