రుహానికా ధావన్ భారతీయ టెలివిజన్ బాల నటి. 2012లో జీటీవిలో ప్రసారమైన మిసెస్.కౌశిక్ కీ పాంచ్ బహూయే సీరియల్ లో ఆషీ పాత్రతో తెరంగేట్రం చేశారు.[1] ఆ సీరియల్ తరువాత స్టార్ ప్లస్ లో ప్రసారమవుతున్న యే హై మొహొబ్బతే సీరియల్ లో రూహీ పాత్రలో, ప్రస్తుతం పీహూ పాత్రలో నటిస్తున్నారు ఆమె. ఆమె తన నటనతో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఇండియన్ టెలీ అవార్డ్ ఫర్ మోస్ట్ పాపులర్ చైల్డ్ యాక్ట్రెస్ పురస్కారం కూడా అందుకున్నారు రుహానికా.
రుహానికా ధావన్ 2007 సెప్టెంబరు 25 న భారతదేశంలోని ఢిల్లీలో జన్మించింది.[2][3][4] ఆమె ఐజిసిఎస్ఇ పాఠశాలలో చదువుతుంది.[5][6]. ఆమె ముంబైలో నివసిస్తోంది.[7] ఆమె హిందీ, ఆంగ్ల భాషలలో మాట్లాడగలదు. జనవరి 2014లో జయ్ హో సినిమాలో అతిధిపాత్రలో కూడా నటించింది. ఫిబ్రవరి 2014లో సన్నీ డియోల్ నటించిన ఘయాల్ వన్స్ ఎగైన్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.[8][9] 2016లో విడుదలైన ఈ సినిమాలో నటించింది.