రూబెన్ డేవిడ్ (1912 సెప్టెంబరు 19 - 1989 మార్చి 24) జంతు శాస్త్రవేత్త, భారతదేశంలోని గుజరాత్ అహ్మదాబాద్ కాంకరియా జంతు ప్రదర్శనశాల స్థాపకుడు.[1]
అతను అహ్మదాబాద్లోని బెనె ఇజ్రాయెల్ యూదు కుటుంబంలో జన్మించాడు.[2] అతను జోసెఫ్ డేవిడ్ చిన్న కుమారుడు.[3] అతను స్వయంగా అభ్యసించిన పశువైద్యుడు. నగరంలో జంతుప్రదర్శనశాలను నిర్మించడానికి 1951లో అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అతనిని ఆహ్వానించింది.[2] అతను కాంకరియా జంతుప్రదర్శనశాలను (ఇప్పుడు కమలా నెహ్రూ జూలాజికల్ గార్డెన్), చాచా నెహ్రూ బల్వాటికా (చిల్డ్రన్స్ పార్క్), నేచురల్ హిస్టరీ మ్యూజియంను కూడా స్థాపించాడు, తరువాత దీనికి ఆయన పేరు పెట్టారు.[4][5][6][7] క్యాన్సర్ కారణంగా అతను మాట్లాడుటను కోల్పోయాడు. [6] అహ్మదాబాద్లోని సుందర్వన్, గాంధీనగర్ ఇంద్రోడా పార్కులకు సలహాదారుగా కూడా పనిచేశాడు.[4]
అతను గుజరాత్ ప్రభుత్వంలో రిటైర్డ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అయిన ఎం. ఎ. రషీద్తో కలిసి ది ఆసియాటిక్ లయన్ (1991) ను రచించాడు.[4]
అతనూ జూలాజికల్ సొసైటీ (FZS) లో ఫెలోగా ఉన్నాడు .[8] 1975లో భారత ప్రభుత్వం అతనిని పద్మశ్రీ తో సత్కరించింది.[4]
ఆస్ట్రేలియన్ మానవ శాస్త్రవేత్త కోలిన్ గ్రోవ్స్ 1981లో చరిత్రపూర్వ వార్థాగ్ను కనుగొని, మధ్య ఆసియా పందికి అతని పేరు మీద సుస్ స్క్రోఫా డేవిడి అని పేరు పెట్టారు.[5][8]
రచయిత్రి ఎస్తేరు డేవిడ్ అతని కుమార్తె.[5]