లక్ష్మీ కటాక్షం (1970 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | బి. విఠలాచార్య |
నిర్మాణం | పింజల సుబ్బారావు |
తారాగణం | నందమూరి తారక రామారావు , కె.ఆర్.విజయ, రాజశ్రీ, సత్యనారాయణ, బాలయ్య |
సంగీతం | ఎస్.పి. కోదండపాణి |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి |
గీతరచన | సి.నారాయణ రెడ్డి, చిల్లర భావనారాయణరావు, కొసరాజు |
నిర్మాణ సంస్థ | పి.ఎస్.ఆర్.పిక్చర్స్ |
భాష | తెలుగు |
లక్ష్మీ కటాక్షం యన్టీ రామారావు, కె.ఆర్.విజయ కాంబినేషన్లో పింజల సుబ్బారావు రూపొందించిన చిత్రం. బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 1970 ఫిబ్రవరి 12న విడుదలయ్యింది.
మహాతపోనిధి కోదండపాణేశ్వరుడు, అతని శిష్యులైన ప్రచండుడు, వినయానందకు అష్టైశ్వర్యాలతో కూడిన లక్ష్మీభాండాగారం గురించి చెబుతాడు. ఆ సంపద లోకకల్యాణం కోసం వినియోగించాలంటాడు. దురాశాపరుడైన ప్రచండుడు నిధిని పొందాలనుకుంటాడు. ఆ నిధి శృంగారపు రాకుమారుని వలనే సాధ్యమవుతుందని గ్రహిస్తాడు. మహారాణి ప్రసవించిన బిడ్డను తస్కరించి తనవద్ద కులవర్ధనుడనే పేరుతో పెంచి పెద్ద చేస్తాడు. నిధిని సాధించటానికి తొలుత అష్ట అండాలు యువరాజుతో సేకరింపచేసి, అతన్ని విసరికొడతాడు. ఈ చర్యకు అడ్డుపడిన వినయుని కుక్కగా మార్చేస్తాడు. వినయానందుని వలన తన విద్యలు, జ్ఞానం తిరిగి గ్రహించిన కులవర్ధనుడు, ప్రచండుని కలుసుకుంటాడు. అతనితో కలిసి లక్ష్మీభాండాగారం కోసం బయలుదేరతాడు. పురంధర రాజ్యంలో ఆ నిధి ఉందని తెలుసుకుంటారు. ఆ దేశపు మహారాణి హేమమాలిని, కులవర్ధనుని పరాక్రమం మెచ్చి అతని సాయంతో నిధి సాధించాలని అనుకుంటుంది. పలు ఆటంకాలు ఎదుర్కొని కులవర్ధనుడు నిధిని సాధిస్తాడు. మాతాపితలను హింసించి.. హేమమాలినిని, నిధిని పొందాలని పన్నాగం పన్నిన ప్రచండుని కులవర్ధనుడు ఓడించటం, అదే సమయంలో గురువు ప్రచండుని శపించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది[1].
హిందూ సంప్రదాయాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా మహాలక్ష్మీదేవి మనందరి ఇల్లల్లో స్థిరంగా ఉండడానికి ప్రాచీన శాస్త్రాలలో తెలియజేయబడ్డాయి. వాటిని వివరిస్తున్న పాట.[2]