వక్కలంక పద్మ

వక్కలంక పద్మ
జననం
న్యూఢిల్లీ
జాతీయతఇండియన్
ఇతర పేర్లుపద్మ రావు
వృత్తిసినిమా నటి, అంతర్జాతీయ జర్నలిస్ట్‌
తల్లిదండ్రులు
బంధువులువక్కలంక స్వప్నసుందరి (సోదరి)

వక్కలంక పద్మ (జననం 1959 జూన్ 17) భారతీయ సినిమా నటి, అంతర్జాతీయ జర్నలిస్ట్‌.[1] ఆమె తెలుగు సినిమా ప్రముఖ గాయని వక్కలంక సరళ కూతురు.

కెరీర్

[మార్చు]

న్యూఢిల్లీలో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించిన వక్కలంక పద్మ 19 ఏళ్ల వయసులో ఒకే ఒక సినిమా గోరింటాకు (1979) లో నటించినా తెలుగు సినిమా ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయింది.[2] దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో శోభన్ బాబు సరసన వక్కలంక పద్మ నటించగా సుజాత, సావిత్రి మఖ్యపాత్రలు పోషించారు.

ఆ తరువాత ఆమె ప్రముఖ జర్మన్ మీడియాకు అంతర్జాతీయ జర్నలిస్ట్‌గా వ్యవహరిస్తోంది.

వ్యక్తిగతం

[మార్చు]

తెలుగు సినిమా గాయని వక్కలంక సరళకు ఇద్దరు కూతుర్లు వక్కలంక స్వప్నసుందరి, వక్కలంక పద్మ కాగా ఒక కొడుకు ఉన్నాడు. 1979లో విడుదలైన గోరింటాకు సినిమాలో వక్కలంక పద్మ నటించింది.[3] ఇక స్వప్నసుందరి ప్రతి సంవత్సరం తల్లి జ్ఞాపకార్ధం, ఆగష్టు 8న స్వరలహరి అనే కర్ణాటక సంగీత కచ్చేరిని నిర్వహిస్తుంది. ఈ కచ్చేరీలో యువ గాయనీగాయకులు వక్కలంక సరళ స్వరపరచిన పాటలను ప్రముఖంగా పాడతారు.[4][5]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Anveshana team finds 'Gorintaku' actress Vakkalanka Padma - TV9 Exclusive, retrieved 2023-05-15
  2. "gorintaku movie special - Sakshi". web.archive.org. 2023-05-15. Archived from the original on 2023-05-15. Retrieved 2023-05-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2013-08-26.
  4. "Rhythm of recall". The Hindu. No. August 10, 2012. Retrieved 2 December 2014.
  5. "Hyderabad today". The Hindu. No. August 8, 2007. Retrieved 2 December 2014.