విఠల్ మహదేవ్ తార్కుండే (3 జూలై 1909 – 22 మార్చి 2004), ప్రముఖ భారతీయ న్యాయవాది, పౌరహక్కుల ఉద్యమకారుడు, మానవవాద నేత. "భారతీయ పౌరహక్కుల ఉద్యమ పితామహుని"గా ఆయన పేరొందారు. బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా ఆయన పనిచేసి పదవీ విరమణ పొందారు.[1][2] భారత సర్వోన్నత న్యాయస్థానం ఆయనను బొంబాయి ఉన్నత న్యాయస్థానంలో "నిస్సందేహంగా 1957 చాగ్లా అనంతర కాలానికి చెందిన అత్యంత విశిష్టమైన న్యాయమూర్తి" అని ప్రశంసించింది.[3]
విఠల్ మహదేవ్ తార్కుండే మహారాష్ట్రలోని పుణె జిల్లాకు చెందిన సస్వాద్ లో జూలై 3, 1909న జన్మించారు. సస్వాద్ కు చెందిన ప్రముఖ న్యాయవాది, సామాజిక సంస్కర్త అయిన మహదేవ్ రాజారాం తార్కుండేకు 5గురిలో రెండవ సంతానంగా ఆయన జన్మించారు.