విద్యా భారతి | |
---|---|
స్థానం | |
ఇండియా | |
సమాచారం | |
రకం | విద్యా సంస్థ |
స్థాపన | 1977 |
స్థితి | యాక్టిివ్ |
Slogan | సా విద్యా యా విముక్తయే |
విద్యా భారతి ( అఖిల్ భారతీయ శిక్షా సంస్ధన్) అనేది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లో ఒక విద్యా విభాగం . ఇది భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ పాఠశాలల నెట్వర్క్లో ఒకటిగా నడుస్తుంది. 2016 నాటికి 32,00,000 మంది విద్యార్థులతో 12,000 పాఠశాలలను నిర్వహిస్తోంది. ఇది లక్నోలో రిజిస్టర్డ్ ప్రధాన కార్యాలయాలన్ని, ఢిల్లీలో ఒక క్రియాత్మక ప్రధాన కార్యాలయాన్ని, అనేక ఉప కార్యాలయాలను కలిగి ఉంది. నాణ్యమైన పాఠశాల విద్యను కోల్పోయిన మిలియన్ల మంది పిల్లల జీవితాలను సాధికారపరచడంలో విద్యా భారతి కృషి చేస్తుంది.[1][2]
ఆర్ఎస్ఎస్, ఎంఎస్ గొల్వాల్కర్ ఆధ్వర్యంలో 1946 లో కురుక్షేత్ర లో తన మొదటి గీత పాఠశాలను స్థాపించింది . అయితే, 1948 లో ఆర్ఎస్ఎస్పై నిషేధం అనేది గీతా పాఠశాలల వ్యాప్తికి విఘాతం కలిగించింది. నిషేధాన్ని ఎత్తివేసిన తరువాత, మొట్టమొదటి సరస్వతి శిశుమందిర్ పాఠశాలను గోరఖ్పూర్లో 1952 లో నానాజీ దేశ్ముఖ్ స్థాపించారు. సరస్వతిిసరస్వతి శిశు మందిర్ పాఠశాలలు చాలా ప్రదేశాలలో త్వరగా వ్యాప్తి చెందాయి. పాఠశాలల సంఖ్య పెరిగేకొద్దీ, ఖచ్చితమైన నిర్వహణ, నిర్మాణాల అవసరం ఏర్పడింది. దీనికి గానూ రాష్ట్ర స్థాయిలో పాఠశాలల మధ్య కార్యకలాపాలను సమన్వయం చేయడానికి శిశు శిక్ష ప్రబందక్ సమితిని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా మన తెలంగాణాలో సరస్వతీ విద్యాపీఠం ను ఏర్పాటు అయింది. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాదులోని బండ్లగూడలో కలదు.[3]
1990 ప్రారంభంలో, ఈ సంస్థ 5,000 పాఠశాలలను, 2003 నాటికి 17 లక్షల (1.7 మిలియన్) విద్యార్థులతో 14,000 పాఠశాలలకు పెరిగింది . భారతదేశంలో విద్యకు పెరుగుతున్న డిమాండ్ వల్ల ఈ విస్తరణ చాలా సులభమైంది. మార్చి 2002 నాటికి, ఇది 17,396 పాఠశాలలు, 22 లక్షల (2.2 మిలియన్లు) విద్యార్థులు, 93,000 మంది ఉపాధ్యాయులు, 15 ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు, 12 డిగ్రీ కళాశాలలు, 7 వృత్తి, శిక్షణా సంస్థలను కలిగి ఉంది. 2019 నాటికి 12,828 అధికారిక పాఠశాలలు, 11,353 అనధికారిక పాఠశాలలను కలిగి ఉన్నాయి.[4]
విద్యా భారతి, విద్యతో పాటు భారతీయ సాంప్రదాయం, సంస్కృతి, జాతీయ భావాలు , ఆధ్యాత్మికీకరణల గురించి అలాగే శారీరక విద్య, సంగీతం, సాంస్కృతిక విద్య వంటి ప్రధాన పాఠ్యాంశాలకు పరిధీయమైన అధ్యయన రంగాలలో స్వంత పాఠ్యాంశాలను రూపొందించి బోధిస్తుంది.[5]
నిర్దేశించిన పాఠ్యప్రణాళికతో పాటు, విద్యా భారతి పాఠశాలలు ఐదు అదనపు విషయాలను బోధిస్తాయి:
ఇందులో స్వతంత్ర సమరయోధుల కథలు, పాటలు, నిజాయితీ , వ్యక్తిగత పరిశుభ్రత ల గురించి బోధిస్తారు.
ఇందులో కర్ర, మార్షల్ ఆర్ట్స్, యోగా, సంగీతం , సంస్కృతం,వేద గణితంల గురించి నేర్పిస్తారు.
బాలికలకు కన్యా భారతి తరగతులు బోధింపబడతాయి. అక్కడ వారు వాస్తవ ప్రపంచ సమస్యలను ముఖ్యంగా "మహిళా-కేంద్రీకృత" సున్నితమైన సమస్యలను చర్చిస్తారు వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటారు. ఝాన్సీ లక్ష్మీబాయి రాణి, సరోజిని నాయుడు, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, కిరణ్ బేడి, వంటి వివిధ రంగాలలో విజయవంతమైన మహిళలను ఆరాధించే బలమైన నాయకులుగా మారడానికి వారికి శిక్షణ ఇస్తారు.
ఉదయం ప్రార్థనా మందిరం లో పిల్లలు సంస్కృత పాటలు, దేశభక్తి స్ఫూర్తిని ప్రార్థించడం, పాడటం, నేర్పుతారు. హిందూ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన సమావేశాలు, రంగస్థల ప్రదర్శనలు దేశభక్తి భావజాలాన్ని తెలియజేయడానికి ఉపయోగపడతాయి.
విద్యాభారతి రాష్ట్ర-స్థాయి అనుబంధ కమిటీలు ప్రతి రాష్ట్రంలోని సామాజిక-రాజకీయ పరిస్థితిని బట్టి వివిధ పేర్లతో ఉంటాయి.
ఢిల్లీ : హిందూ శిక్షా సమితి
హర్యానా : హిందూ శిక్షా సమితి
పంజాబ్ : సర్వ్ హిట్కారి శిక్షా సమితి
బీహార్ : విద్యా వికాస్ సమితి
జమ్మూ : భారతీయ శిక్షా సమితి
జార్ఖండ్ : వనంచల్ శిక్షా సమితి, విద్యా వికాస్ సమితి,శిశు శిక్షా వికాస్ సమితి
ఒడిశా : శిక్షా వికాస్ సమితి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ : శ్రీ సరస్వతి విద్యా పీఠం
తమిళనాడు : తమిళ కల్వి కజగం , వివేకానంద కేంద్రం
కేరళ : భారతీయ విద్యా నికేతన్
అస్సాం : శిశు శిక్షా సమితి
ఉత్తరాఖండ్ : భారతీయ శిక్షా సమితి
ఉత్తర ప్రదేశ్ : భారతీయ శిక్షా సమితి