శతమానంభవతి | |
---|---|
దర్శకత్వం | సతీష్ వేగేశ్న |
రచన | సతీష్ వేగేశ్న |
నిర్మాత | దిల్ రాజు |
తారాగణం | శర్వానంద్ అనుపమ పరమేశ్వరన్ ప్రకాష్ రాజ్ |
ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి |
కూర్పు | మధు |
సంగీతం | మిక్కీ జె. మేయర్ |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ |
విడుదల తేదీ | జనవరి 14, 2017 |
సినిమా నిడివి | 2 గం. 15 ని |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 8 కోట్లు |
శతమానంభవతి సతీష్ వేగేశ్న దర్శకత్వంలో 2017 లో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలు పోషించారు.
అందమైన 'ఆత్రేయపురం ' అనే పల్లెటూరులోని రాజుగారు(ప్రకాష్ రాజ్), జానకమ్మ(జయసుధ) మనవడు రాజు(శర్వానంద్)తో కలిసి నివసిస్తూ ఉంటారు. రాజుగారి ఇద్దరి కొడుకులు, ఒక కూతురు అమెరికాలో ఉంటారు. ఎప్పుడో కానీ తమను చూడటానికి రాని పిల్లలకోసం రాజుగారు బాధ పడుతూ ఉంటారు. ఓ పథకం వేసి తన పిల్లలను సంక్రాంతికి వచ్చేలా చేస్తారు రాజుగారు. ఇంటికి వచ్చిన కొడుకులు, కూతుళ్ళతో సరదాగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో రాజుగారి మనవరాలు నిత్యా(అనుపమ పరమేశ్వరన్), రాజుతో ప్రేమలో పడుతుంది. ఈలోపు రాజుగారి వేసిన పథకం జానకమ్మకు తెలియడంలో కుటుంబంలో విబేదాలు వస్తాయి. అసలు రాజుగారు వేసిన పథకం ఏమిటి? అనే విషయం మిగిలిన కథలో భాగం. [1]
మెల్లగా తెల్లారిందో, రచన: శ్రీమణి, గానం.అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా, మోహన భోగరాజు
నాలో నేను , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం . సమీర భరద్వాజ్
నిలవదే , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.ఎస్ . పి బాలసుబ్రహ్మణ్యం
హైలో హైలెస్సారే , రచన: శ్రీమణి, గానం.ఆదిత్య అయెంగార్ , రోహిత్ పరిటాల , మోహన భోగరాజు, దివ్య దివాకర్
శతమానం భవతి , రచన : రామజోగయ్య శాస్త్రి,గానం.విజయ్ యేసు దాస్, కె ఎస్ చిత్ర.
సంవత్సరం | అవార్డు | విభాగము | లబ్ధిదారుడు | ఫలితం |
---|---|---|---|---|
2016 | నంది పురస్కారాలు | ఉత్తమ దర్శకుడు | సతీష్ వేగేశ్న | గెలుపు |
2016 | నంది పురస్కారాలు | ఉత్తమ సహాయనటి | జయసుధ | గెలుపు |
2016 | నంది పురస్కారాలు | ఎస్.వి.రంగారావు క్యారెక్టర్ అవార్డు | నరేష్ | గెలుపు |
2016 | నంది పురస్కారాలు | ఉత్తమ ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి | గెలుపు |