శివాంగీ జోషి | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | బెగుసరాయ్ యే రిష్తా క్యా కెహ్లతా హై బాలికా వధు 2 ఖత్రోన్ కే ఖిలాడీ 12 |
శివాంగీ జోషి (జననం 1998 మే 18) భారతీయ నటి, ఆమె ప్రధానంగా హిందీ టెలివిజన్ ధారావాహికలలో పనిచేస్తుంది. ఆమె 2013లో త్రిష పాత్రలో నటించిన ఖేల్తీ హై జిందగీ ఆంఖ్ మిచోలీతో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఆమె యే రిష్తా క్యా కెహ్లతా హైలో నైరా సింఘానియా పాత్రకు ప్రసిద్ధి చెందింది, దీనికిగాను ఆమె అనేక అవార్డులను సైతం అందుకుంది.[1]
శివాంగికి పేరుతెచ్చిపెట్టిన ఇతర పాత్రలలో బీన్తెహాలో ఆయత్ హైదర్, బెగుసరాయ్లో పూనమ్ ఠాకూర్, బాలికా వధు 2లో ఆనంది చతుర్వేది ఉన్నాయి. 2022లో, ఆమె ఖత్రోన్ కే ఖిలాడీ 12లో పాల్గొని 12వ స్థానంలో నిలిచింది. 2023 నుండి, ఆమె బర్సాతీన్ – మౌసమ్ ప్యార్ కాలో ఆరాధనా సాహ్ని ప్లే చేస్తోంది.
2020లో, ఆమె లవ్ ఎక్స్ సొసైటీ అనే షార్ట్ ఫిల్మ్ లో గీతాంజలి పాత్రపోషించింది.[2] అలాగే, 2023లో ఆమె వెబ్ సీరీస్ జబ్ వి మ్యాచ్డ్ లోనూ నటించింది.[3] ఆమె పిల్లల సమగ్ర అభివృద్ధికి తోడ్పడేందుకు క్రికెటర్ కపిల్ దేవ్ నిర్వహిస్తున్న ప్రభుత్వేతర సంస్థ ఖుషీకి యూత్ అంబాసిడర్.[4]
శివాంగి జోషి మహారాష్ట్రలోని పూణేలో 1998 మే 18న జన్మించింది.[5] ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఆమె పాఠశాల విద్యను అభ్యసించింది.[6]
యునైటెడ్ కింగ్డమ్ ఆధారిత వార్తాపత్రిక ఈస్టర్న్ ఐ 50 మంది సెక్సీయెస్ట్ ఆసియా మహిళల జాబితాలో, ఆమె 2018లో 5వ స్థానంలో ఉండగా, 2019లో 7వ స్థానంలో నిలిచింది.[7][8]
ఈస్టర్న్ ఐ టాప్ 50 ఆసియన్ సెలబ్రిటీలలో ఆమె 2020లో 26వ ర్యాంక్ను పొందింది. ఆమె ఈస్టర్న్ ఐ టాప్ 30లో 30 గ్లోబల్ ఆసియన్ స్టార్స్ లిస్ట్ ఆఫ్ 2022లో కూడా ర్యాంక్ పొందింది.[9][10]
భారతీయ టెలివిజన్ జాబితాలో టైమ్స్ ఆఫ్ ఇండియా 20 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్స్లో, ఆమె 2019లో 7వ స్థానంలో, 2020లో 9వ స్థానంలో నిలిచింది.[11][12]
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |archive-date=
(help)