సచ్చిదానంద రౌత్రాయ్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | గురుజంగ్, ఖొద్రా | 1916 మే 13
మరణం | 2004 ఆగస్టు 21 కటక్ | (వయసు 88)
కలం పేరు | సచీ రౌతర |
రచనా రంగం | కవిత్వం |
గుర్తింపునిచ్చిన రచనలు | పల్లిశ్రీ |
పురస్కారాలు | జ్ఞానపీఠ పురస్కారం |
సచ్చిదానంద రౌత్రాయ్ (1916–2004) ఒరియా భాషకు చెందిన కవి, నవలా రచయిత , లఘు కథా రచయిత. Archived 2020-02-01 at the Wayback Machine ఈయనకు 1986 లో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఈయన "సాచీ రౌత్రాయ్"గా సుపరిచితులు.[1]
రౌత్రాయ్ మే 13, 1916 న ఖుర్దాకు దగ్గరలో గల గురుజంగ్లో Archived 2020-02-01 at the Wayback Machine జన్మించారు.[2] ఈయన బెంగాల్ లో విద్యాభ్యాసం చేశారు. ఈయన గొల్లపల్లిలో రాజకుటుంబానికి చెందిన రాకుమారిని వివాహమాడారు.[1]
రౌత్రాయ్ తన 11 యేండ్ల వయసు నుంచే రచనా ప్రస్థానాన్ని ప్రారంభ్హించారు.[1] పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమ భావాలు ఉన్నాయన్న కారణంగా ఆయన రచనలలో కొన్నింటిని బ్రిటిష్ రాజులు నిషేధించారు.
ఆయన కటక్లో ఆగష్టు 21, 2004 లో మరణించారు.[1]
రౌత్రాయ్ తన రచనా వ్యాసాంగాన్ని 1932లో " పథేయ " (తొలి కవిత) తో ప్రారంభించాడు. 1943లో బాజీ రౌత్ అనే కవిత ప్రచురణతో రౌత్రాయ్ ఒరియా పాఠకులలో చాలా ప్రాచుర్యం పొందాడు. ఈ దీర్ఘ కవిత, బ్రిటీషు పోలీసులను తన్న చిన్న పడవలో బ్రాహ్మణి నది ఆవలి ఒడ్డుకు చేర్చటానికి నిరాకరించినందుకు, వారి బుల్లెట్లకు బలైన పడవనడిపే అబ్బాయి యొక్క వీరమరణాన్ని కీర్తిస్తుంది. రౌత్రాయ్ కవితా ఝరి అనర్గళంగా సాగింది. ఈయన దాదాపు ఇరవై దాకా కవితా సంపుటాలను ప్రచురించాడు. ఈయన పట్టణపు యువతి యొక్క వేదనను, కష్టాలను చిత్రిస్తూ వ్రాసిన ప్రతిమా నాయక్ ఎంత ప్రాచుర్యం పొందిందో, ఒరిస్సా గ్రామీణ జీవితంపై వ్రాసిన పల్లిశ్రీ', కూడా అంతే ప్రాచుర్యం పొందింది. ఈయన ప్రజా కవులుగా పేరు Archived 2020-02-01 at the Wayback Machineపొందిన రచయితల కోవకు చెందుతాడు[1]
రౌత్రాయ్ మతసంబంధమైన విషయాలపై కూడా కొన్ని కవితలు ప్రచురించాడు.
Sachi Routray was born in Gurujang near Khurda on May 13, 1916.