సదర్ దివానీ అదాలత్ (ఉర్దూ: سدار دیوانی عدالت, బెంగాలీ: সদর দেওয়ানি আদালত ) 1772లో బ్రిటిష్ ఇండియాలో వారెన్ హేస్టింగ్స్ చేత కలకత్తాలో రెవిన్యూ వ్యాజ్యాలను పరిష్కరించడానికి స్థాపించబడిన అత్యున్నత న్యాయస్థానం. దీనికి 1780లో, తిరిగి 1793లో బ్రిటిష్ పార్లమెంటు సంస్కరణలు తెచ్చింది. ఈ న్యాయస్థానంలో గవర్నర్ జనరల్, ఈస్ట్ ఇండియా కంపెనీ కౌన్సిల్ సభ్యులు న్యాయాధిపతులుగా ఉండేవారు. వీరు స్థానిక న్యాయమూర్తులు, రెవెన్యూ అధికారుల సహాయంతో పనిచేసేవారు.
ఈ ఉర్దూ పదాల యొక్క అర్ధాలు
భారతదేశంలో హిందూ మతస్థులకు ఆస్థి వ్యవహారాలలో హిందూ చట్టాలను వర్తింపచేయటానికి ఈ న్యాయస్థానం ఏర్పరచబడింది. అప్పటి వరకు హిందువులపై కూడా ముస్లింల నేర చట్టంతో పాటు ముస్లిం ఆస్తి చట్టాలను వర్తింపజేసేవారు. ఈ న్యాయస్థానం ఏర్పడిన తర్వాత కూడా నేర చట్టాలలో ముస్లిం చట్టాలను వర్తింపజేయడం కొనసాగింది. [full citation needed][full citation needed]
బ్రిటిష్ ఇండియాలోని ప్రతి జిల్లాలో, 500 రూపాయల వరకు ఖచ్చితమైన అధికార పరిధి కలిగిన అధీన రెవెన్యూ న్యాయస్థానాలు స్థాపించబడ్డాయి. ఇందులో న్యాయమూర్తులుగా సంబంధిత జిల్లా కలెక్టర్, డిప్యూటీ కలెక్టరు, రిజిస్ట్రార్ ఉండేవారు. వీరికి సహాయంగా స్థానిక అధికారులు పనిచేసేవారు. 500 రూపాయలకు మించిన కేసులను, సదర్ దివానీ అదాలత్ కు అప్పీలు చేసుకునే అనుమతి ఇవ్వబడింది. [full citation needed][full citation needed]