సింహాద్రి (2003 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | ఎస్.ఎస్.రాజమౌళి |
నిర్మాణం | వి. విజయేంద్ర కుమార్ |
రచన | విజయేంద్ర ప్రసాద్ |
తారాగణం | జూనియర్ ఎన్.టి.ఆర్ భూమిక అంకిత నాజర్ |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వర రావు |
విడుదల తేదీ | 9 జూలై 2003 |
దేశం | ![]() |
భాష | తెలుగు |
పెట్టుబడి | 8.5 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సింహాద్రి 2003 లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన విజయవంతమైన చిత్రం. జూనియర్ ఎన్. టి. ఆర్, భూమిక ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.[1] ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీ రవీంద్రబాబు, ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావులు అందించారు.
2003 జూలై 9న విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ చిత్రం ₹8.5 కోట్ల (US$1.8 మిలియన్లు) బడ్జెట్తో నిర్మించబడింది. డిస్ట్రిబ్యూటర్స్ షేర్ ₹26 కోట్లు (US$5.6 మిలియన్లు) వసూలు చేసింది.[2][a] ఈ చిత్రం తరువాత తమిళంలో గజేంద్ర (2004)గా కన్నడలో కంఠీరవ (2012), బంగ్లాదేశ్లో బెంగాలీలో దుర్దోర్షో (2005) గా రీమేక్ చేయబడింది.
వసంత కోకిల సినిమా క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ ను వదిలివెళ్ళిపోయిన సన్నివేశాన్ని గురించి మాట్లాడుకుంటూ "హీరోయిన్ హీరోని వదిలి వెళ్ళిపోతూంటే, గుండెల్లో గునపంతో పొడిచేసినట్టు లేదూ" అని విజయేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యతో ఈ సినిమా కథకు బీజం పడింది. ఆ మాట పట్టుకుని ఆయన అసిస్టెంట్ అమ్మ గణేశ్ హీరోని తాను అమితంగా ప్రేమిస్తున్న హీరోయిన్నే గుండెల్లో గునపంతో పొడిచినట్టుగా కథ రాసుకుందాం అనడంతో అలా చేసేందుకు దారితీసే కారణాలు ఏమిటన్న పద్ధతిలో ఈ కథ రాసుకున్నారు. అయితే కథలో కీలకమైన ఫ్లాష్ బాక్ కు వేరేదైనా ప్రదేశాన్ని నేపథ్యంగా తీసుకోవాలని భావించి కేరళను ఎంచుకున్నారు. ఈ కథని బాలకృష్ణ కథానాయకునిగా బి.గోపాల్ దర్శకత్వంలో సినిమాగా తీద్దామని భావించినా వారు వేరే కథను ఎంచుకోవడంతో దొరైస్వామిరాజా నిర్మాతగా ఈ సినిమా తీస్తానని ముందుకువచ్చారు. దాంతో జూనియర్ ఎన్.టి.ఆర్. కథానాయకునిగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో సినిమా ప్రారంభం అయింది.[4]
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/>
ట్యాగు కనబడలేదు